దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగుల పట్ల మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే ఏ ఉద్యోగి అయినా మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యుల ఇబ్బందులను తీర్చే విధంగా అడుగులు వేస్తోంది. విధులు నిర్వహిస్తూ ఉద్యోగి మరణించిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ చెల్లించాలని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబం నుంచి వచ్చిన క్లెయిమ్ వెంటనే నెల వ్యవధిలో గా ఆ కుటుంబానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.పాత పెన్షన్ పథకం, జాతీయ పెన్షన్ కింద ఉండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి అందాల్సిన మొత్తాన్ని ఆ కుటుంబానికి అందించాలని తెలిపింది.
ఈ క్రమంలోనే ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని ఎన్పీఎస్ పెన్షన్ కార్పస్ ను కుటుంబ సభ్యులకు వెంటనే అందించడమే కాకుండా పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తున్న సమయంలోనే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 1 నుంచి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల పింఛన్ జారీ, ఇతర వివరాలను నెలవారీగా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.






























