రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఆదివారం ఉదయం వరకూ అందిన సమాచారం ప్రకారం కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా మరియు ప్రత్యేక్షంగా సేకరించిన 24 కోట్లకు పైగా మోతాదులు ఇప్పటికే రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు పేర్కొంది. ఇందులో వ్యర్థాలతో సహా 22,96,95,199 మోతాదులు వినియోగించినట్లు పేర్కొంది. ఇంకా 1,63,85,701 డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది.

ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 32,42,502 సెషన్ల ద్వారం మొత్తం 23,13,22,417 మొతాడులను లబ్దిదారులకు పంపిణీ చేసినట్టు తెలిపింది కేంద్రం.






























