Murali Mohan shares interesting incident with Krishna fans : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ సుపరిచితులు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు.ఇటీవల ఆయన అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కృష్ణ గారి అభిమానులతో జరిగిన సంఘటనను వివరించారు.

కృష్ణ గారిని అలా చూపించొద్దు…అంటూ అభిమానుల గొడవ….
మురళీ మోహన్ గారూ, సూపర్ స్టార్ కృష్ణ గారు చదివేటపుడు క్లాస్ మేట్స్. అప్పటినుండి కృష్ణ గారితో పరిచయం ఉందట మురళీ మోహన్ గారికి. ఇక కృష్ణ గారు సినిమాల్లోకి రావడం ఆ తర్వాత సూపర్ స్టార్ అవ్వడం చక చక జరిగిపోయాయి. ఇక కృష్ణ, నాగార్జున కలయిక లో వారసుడు చిత్రాన్ని తీసినపుడు ఆ సినిమాలో నాగార్జున, తండ్రి కృష్ణను నిలదీసే సన్నివేశం లో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తారా స్థాయికి వెళ్లే సీన్ లో కృష్ణ, నాగార్జున నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వస్తారని ఇక ఆ సీన్ చూసిన కృష్ణ అభిమానులు మా ఇంటి మీదకు గొడవకు వచ్చారని గుర్తు చేసుకున్నారు.

కొంతమంది అయితే నన్ను కొట్టడానికి కూడా వచ్చారని ఆయన అన్నారు. కృష్ణగారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడు? అలా అనడానికి వీల్లేదు.. ఆ సన్నివేశాన్ని ని తొలగించండి,లేకపోతే సన్నివేశాన్ని మార్చండి అంటూ మా ఇంటి ముందు గొడవకు దిగారని ఆయన అప్పటి సంఘటనను పంచుకున్నారు.సినిమా గురించి, సన్నివేశాల గురించి వివరించిన, వ్యక్తిగతంగా తీసుకోవద్దని చెప్పిన వారు వినలేదని అన్నారు.

ఇక కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఆయన చాలా గొప్పవారని చాలా మంది నిర్మాతలను ఆదుకున్నారని, డబ్బులేదు సినిమా చేయలేమంటే అవన్నీ తరువాత ముందు సినిమా చేయండి అని వారికి ధైర్యం చెప్పేవారని మురళీ మోహన్ చెప్పారు.కృష్ణ గారిలాంటి గొప్ప వ్యక్తిని నేనింత వరకు చూడలేదంటూ ఆయన గురించి వివరించారు.


































