Nagachaitanya: నందమూరి తారకరత్న మరణ వార్త చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.తారకరత్న మరణించడంతో ప్రతి ఒక్కరూ తారకరత్న మృతి పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య సైతం తారకరత్న మరణం పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే అక్కినేని అభిమానులు బాలయ్య పై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

వీర సింహారెడ్డి సినిమా సక్సెస్మెంట్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ గురించి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందిస్తూ కళామతల్లి ముద్దుబిడ్డలు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి వారిని అవమానపరిస్తే మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ పరోక్షంగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు.
ఈ విషయంపై అక్కినేని అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన బాలయ్య ఏఎన్ఆర్ గారు తనకి తండ్రి సమానులని ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఆయనను నేను ఎందుకు అవమానిస్తాను తనపై నాకు ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికీ నా గుండెల్లో అలాగే ఉంది అంటూ తెలియజేశారు.

Nagachaitanya: తారకరత్న కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి….
ఇకపోతే తారకరత్న మరణించడంతో నాగచైతన్య ఉగ్రం సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాగచైతన్య వేదికపై తారకరత్న మరణ వార్త పై స్పందిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తూ తారకరత్న గారికి నివాళులు అర్పించాలని తెలిపారు. తారకరత్న కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈయన కోరుకున్నారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్య సంస్కారం అంటే ఏంటో చూసి నేర్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.






























