Nagarjuna: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి ఆలోచించి ఎన్నో పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే రైతుల క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలలో రైతు బంధు పథకం ఒకటి.ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతుల అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులను జమ చేస్తూ ఉన్నారు. ఇలా రైతు బంధు పథకం ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలంగాణ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన రైతుబంధు పథకం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఐపీఎస్ అధికారి అనుకూరి మురళి ఈ పథకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రైతుల కోసం తీసుకు వచ్చినటువంటి రైతుబంధు పథకం కేవలం రైతులకు మాత్రమే కాకుండా సంపన్నులు కూడా ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారని ఈయన తెలిపారు.
ఈ క్రమంలోని హీరో అక్కినేని నాగార్జునకు కూడా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని ఈయన ఆరోపించారు. ఈయన సినిమా హీరోగా మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఎన్నో బిజినెస్ లు, వందల ఎకరాలు ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో కూడా ఉంది.ఇలా వందల ఎకరాలు ఉన్నటువంటి నాగార్జున కూడా రైతు బంధు పథకానికి అర్హుడు అంటూ ఈయన ఈ పథకం పై విమర్శలు కురిపించారు.

Nagarjuna: వ్యవసాయం చేయని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రైతుబంధుకు అర్హులేనా…
గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో స్థిరపడిన వారికి తెలంగాణలో వందల ఎకరాలు భూములు ఉన్నవారు కూడా ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారని ఈయన వెల్లడించారు. వ్యవసాయం చేయని ఎమ్మెల్యేలు మంత్రులు సంపన్నులు సైతం ఈ పథకానికి లబ్ధిదారులుగా మారారంటూ ఈయన తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































