టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ఆచార్య .దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. దసరాకి అయినా విడుదల అవుతుంది అనుకుంటే సంక్రాంతికి వాయిదా వేశారు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు భారీగానే స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను పూర్తిచేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.
A memorable melody from #Manisharma to take you back in time ????#Acharya second single #Neelambari releasing on 5th Nov at 11:07 AM ❤️#AcharyaOnFeb4th
— Konidela Pro Company (@KonidelaPro) November 2, 2021
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #NiranjanReddy @MatineeEnt @adityamusic pic.twitter.com/NVXKNLMY48
ఈ సినిమా సెకండ్ సింగిల్ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నీలాంబరి అనే పాటను నవంబర్ 5 వ తేదీన ఉదయం 11.07 నిముషాలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.































