తెలుగు రాజకీయాల్లో మళ్ళీ పాత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ తిరుగుతున్నాయి. “విధి ఎవ్వరినీ వదలదు, అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరినైనా ఏదైనా అనొచ్చు, కానీ ఒక రోజు మనకూ అదే ఎదురవుతుంది. ఏడుస్తూ ఎవరి జాలికి ఆశపడకు” అని రోజా అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ వీడియో ఇప్పుడు తిరిగి వైరల్ అవుతోంది.

దీనికి కారణం ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒక టీవీ చర్చలో కంటతడి పెట్టిన ఘటన. గతంలో మీడియా ముందు ఏడిచే నాయకులపై దొంగ ఏడుపులు అంటూ కామెంట్స్ చేసిన రోజానే, ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో నెటిజన్లు ట్రోలింగ్కు తెరలేపారు. ఒకప్పుడు తన మాటలతో కఠినంగా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు తానెదుర్కొంటున్న తప్పుడు ప్రచారంపై బాధపడుతూ వ్యాఖ్యలు చేయడం పలువురికి విరుద్ధంగా కనిపిస్తోంది.
రోజా ఆరోపణల ప్రకారం, గాలి భానుప్రకాశ్ అనే నేత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఫేక్ ఫొటోలు, పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ సోషల్ మీడియా మాత్రం ఆమె వ్యాఖ్యలపై, గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎద్దేవా చేస్తోంది.
గతంలో ఆమె చేసిన బూతు వ్యాఖ్యలు, విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులపై వాడిన పదజాలం ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. ఎవరిని ఎలా విమర్శించారో, ఇప్పుడు అదే తీరు తమకూ ఎదురవుతుందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. “ఎత్తి చూపితే నాలుగు వేళ్లు నిన్నే చూపుతాయి” అనే సామెతను ప్రస్తావిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
రోజా ఒకవైపు బాధపడుతున్నప్పటికీ, ఆమె గత ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, నెటిజన్లు పెద్దగా సానుభూతి చూపడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుగా వేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తిరుగుబాటయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే, ‘విధి ఎవ్వరినీ విడిచిపెట్టదు’ అనే రోజా మాటలే ఇప్పుడు ఆమె జీవితానికి ప్రత్యక్ష ఉదాహరణగా మారింది.
That's it, That's the Tweet 🈂️🈁 pic.twitter.com/TnIrXnREmv
— Sandhya Reddy YSCRP 🇱🇸 (@SandhyaSamayam) July 19, 2025


































