Viral News: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి.. ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా విస్తరించింది. చిన్నా పెద్ద, ధనిక – బీద అనే తేడాలు లేకుండా అందర్ని లెక్కలు తేలుస్తోంది. కరోనా మొదట్లో వ్యాక్సిన్లు లేక లక్షల మంది ప్రజలు పిట్టల్లా రాలారు.

ఇప్పటికే ప్రపంచంలో 30 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 50 లక్షలకు పైగా జనాలు మరణించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చినా… కరోనా తన రూపాన్ని మార్చుకుని ఓమిక్రాన్ రూపంలో మళ్లీ ప్రజలపై విరుచుకు పడుతోంది. ఇదిలా ఉంటే కరోనాపై మీమ్స్, సెటైర్లకు కొదవ లేదు. కరోనే కేంద్రంగా ఎన్నో స్కిట్లు, హాస్య చిత్రాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఓ విద్యార్థి.. ఫిజిక్స్ లోని న్యూటన్ నాలుగో నియమాన్ని ఏకంగా కరోనాకే అప్లై చేశాడు. కరోనా పరిశోధన, కరోనా వ్యాప్తి ఒకదానికొకటి అనులోమాను పాతంలో ఉంటాయని తేల్చాడు. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనా తగ్గుముఖం పడుతోంది. దీనిని ఓ సమీకరణాన్నే రూపొందించాడు. పైగా ‘కే’ అనే స్థిరాంకాన్ని ‘‘ వినాశనం’’ ను సూచిస్తుందని చెప్పాడు.
ప్రస్ట్రేషన్ కు గురైన సదరు విద్యార్థి కరోనాకు ..
ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతుందనుకుంటున్న సమయంలో కరోనా.. ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ పడగ విప్పుతోంది. దీంతో మరోసారి జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి ఏర్పడింది. జనాలు మళ్లీ ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నారు. స్కూళ్లు మూపడుతున్నాయి. మాల్స్, థియేటర్లు మూతపడుతున్నాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రస్ట్రేషన్ కు గురైన సదరు విద్యార్థి కరోనాకు ఏకంగా… సమీకరణాన్నే రూపొందించాడు. అంతేకాదు ఈ విషయానికి “కోవిడ్ కాల్ కా న్యూటన్ (న్యూటన్ ఆఫ్ కోవిడ్ టైమ్స్)” అనే క్యాప్షన్ జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది ట్విట్లర్ లో వైరల్ గా మారుతోంది. నవ్వులు పూయిస్తోంది.

































