వీళ్లకు పిచ్చి అనాలో వెర్రి అనాలో అర్ధం కావడంలేదు.. అసలే కరోనా వైరస్ ధాటికి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెటర్లు ఒకరి తరువాత ఒకరు పట్టుబడుతున్నారు. మొన్న షోయబ్ అక్తర్, ఈరోజు షాహిద్ ఆఫ్రిది కరోనా ధాటి నుంచి పాకిస్తాన్ ను ఆదుకునేందుకు మరియు ఫైనాన్సియల్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు ఇండియా , పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభించాలని కోరాడు. అంతేకాదు మరోవైపు మోడీ ప్రభుత్వంపై కూడా ఘాటు విమర్శలు చేసాడు.

కేవలం మోడీ ప్రభుత్వం వల్లనే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు అంతంతమాత్రంగా తయారయ్యాయని ఆరోపించాడు. పాకిస్తాన్ ఎప్పుడు సానుకూలంగా వ్యాహరిస్తుంటే మోడీ ప్రభుత్వం మాత్రం నెగెటివీటిని స్ప్రెడ్ చేస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. అయితే సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలను ఆపే వరకు ఇండియా , పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.































