Pathan Movie: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటూ ఉంది.ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం పఠాన్.ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.

ఈ క్రమంలోనే పఠాన్ సినిమా నుంచి తాజాగా విడుదలైనటువంటి బేషారం రంగ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అయితే ఈ పాట విడుదలైన అనంతరం ఇందులో దీపిక పదుకొనే వస్త్ర ధారణ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇందులో ఈమె భారీ ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెళ్లయినప్పటికీ దీపికా పదుకొనే ఏమాత్రం ఎక్స్పోజింగ్ తగ్గించడం లేదని కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇలా అవకాశాల కోసం ఎక్స్పోజ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటలో దీపికా పదుకొనే వస్త్రధారణ పై స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా షాకింగ్ కామెంట్లు చేశారు.

Pathan Movie:మంత్రులు కూడా సెన్సార్ సభ్యులు అయ్యారా…
బేషారం రంగ్ సాంగ్ లో నటి దీపిక పదుకొనే వస్త్రధారణ ఏమాత్రం బాగాలేదని, డర్టీ మైండ్ సెట్ తో ఈ పాటను చిత్రీకరించారని ఈయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈ పాటలోని క్లిప్పింగ్స్, దీపిక డ్రెస్సింగ్, వంటివి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఈ సినిమాని మధ్యప్రదేశ్లో విడుదల కానివ్వమంటూ చిత్ర బృందం పై మండిపడుతూ వారికి వార్నింగ్ ఇచ్చారు.ఇలా మినిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ మధ్యకాలంలో మంత్రులు కూడా సెన్సార్ సభ్యులయ్యారా అంటూ కొందరు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
































