Puri jagannadh: ఆగస్టు 24వ తేదీ వరకు పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టబోతున్నారని ప్రతి ఒక్కరూ భావించారు. ఇలా ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ అలాగే అభిమానులలోను ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఫస్ట్ షో బొమ్మ డిజాస్టర్ కావడంతో ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరి అయిపోయాయి. ఈ సినిమా ఫస్ట్ షో చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదు.ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున పూరి జగన్నాథ్ గురించి కామెంట్లు వెల్లువెత్తాయి. ఒకప్పుడు పోకిరి సినిమా చేసిన పూరి జగన్నాథ్ సినిమా నేనా ఇది అంటూ కొందరు కామెంట్లు చేశారు.
ఏది ఏమైనా పూరి జగన్నాథ్ సినిమాలు ఒకప్పటిలా లేవని ఈయన కంటెంట్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఎన్నో ర్యాంపులు, వ్యాంపులు వస్తుంటాయికానీ నీకోసం వదిన ఎంతో కష్టపడింది తనను కష్టపెట్టకు తనని బాగా చూసుకో అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Puri jagannadh: పుండు పై కారం చల్లుతున్న నెటిజన్స్…
ఈ విధంగా కొందరు ఈ విషయాలపై స్పందిస్తూ ప్రస్తుతం కామెంట్లు చేస్తున్నారు ఒకప్పుడు పూరి జగన్నాథ్ తన భార్యను చాలా ఇబ్బంది పెట్టారు. ఆమె ఉసురే తనకు తగిలిందని, అందుకే తన సినిమా ఇలా డిజాస్టర్ అయ్యింది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ అసలే సినిమా ఫ్లాప్ అయిందన్న బాధలో పూరి జగన్నాథ్ ఉండగా మరి ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టడం అవసరమా అంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.




























