టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం “ఛత్రపతి”. 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ విజయంగా నిలిచింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

“ఛత్రపతి” రీమేక్ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి సమక్షంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. “ఛత్రపతి” సినిమాను రీమేక్ ను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ పాత్రలో నటించడం కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా
కసాండ్రా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక “ఛత్రపతి”సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు ఇది రెండవ బాలీవుడ్ చిత్రం అని చెప్పవచ్చు.



























