టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో గాయపడి.. 35 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. దసరా పండుగ రోజు డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అతడు ఇంటికి రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంలో ఉన్నారు. దీనికి సంబంధించి జనసేన కూడా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. తేజు ఆరోగ్యంగా ఇంటికి రావాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

సాయి ధరమ్ తేజ్ ప్రేమకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు.. లారిస్సా బోనెసి. బ్రెజిలియన్ మోడల్ కమ్ హీరోయిన్. తిక్క సినిమాలో సాయి తేజ్ కి జోడీగా నటించింది. ఆమెతో సాయికి ముడిపెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై ఆమె పెట్టే పోస్టులు కూడా దానికి బలాన్ని చేకూర్చినట్లు చేస్తోంది.
ఆ పోస్టులతోనే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా..అనే సందేహం కలుగుతోంది. సాయి తేజ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ.. రిపబ్లిక్ మూవీ రిలీజ్ టైమ్ లో.. నా తేజు నటించిన రిపబ్లిక్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందంటూ ఓ ట్వీట్ చేసింది. అలాగే ఐ మిస్ యూ తేజ్ అంటూ రీసెంట్ గా మరో ట్వీట్ చేసింది.ఇక తన ప్రేమను ఖరారు చేసేంత రేంజ్ లో ‘ఐ యామ్ ఇన్ లవ్’ అంటూ మరో ట్వీట్ చేసింది.
దీంతో సీన్ అంతా ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. ఇంకేం లారిస్సా, సాయిధరమ్ తేజ్ తో లవ్ ఉందని కన్ఫార్మ్ చేసేశారు. ఇదే కనుక నిజమైతే మరి సాయి తేజ్, లారిస్సా ను పెళ్ళి చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సాయి తేజ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.
































