అక్కినేని సమంతకు కోపం వచ్చింది.. ఎప్పుడు కూల్ గా ఉండే సమంతకి కోపం ఎందుకు వచ్చిందో తెలుసా… ఒక అభిమానికి వేలు చూపించి వెంటపడొద్దని చెప్పింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే…

ఇటీవలే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లిన సమంతకి ఫాన్స్ నుండి ఇబ్బంది కలగడం జరిగింది. దర్శనానికి వెళ్లే సమయంలో ఫాన్స్ ఆమెతో ఫోటోలు దిగడానికి ప్రయత్నించగా కొంత అసహనానికి గురైనా.. ఆమె అభిమానుల కోరిక మేరకు కొంతమంది అభిమానులతో ఫోటోలు దిగింది. అందులో ఒక వ్యక్తి మాత్రం సమంత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి వీడియోలు తీయడం గమనించింది, ఆలా తీయవద్దని సహనంగా చెప్పినా వినకపోవడంతో సమంత ఆ వ్యక్తికి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చింది. సమంత తన సినిమా విడుదల సమయంలో తిరుమలకి వెళ్తూ ఉంటుంది. అయితే సినీ ప్రముఖులలకు ఇలాంటి సందర్భాలు ఎదురవడం సాధారణమే..

ఇటీవలే సమంత నటించిన “జాను” సినిమా విడుదల అయ్యింది. “96” రీమేక్ గా జాను సినిమాని తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. ఈ సినిమాలో సమంత పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది కానీ అనుకున్న రీతిలో ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని చెప్పొచ్చు. ఇప్పుడు సమంత విజయ్ సేతుపతి సరసన తమిళంలో “కాతు వాకుల రెండు కాదల్” అనే చిత్రానికి ఓకే చెప్పింది, ఈ చిత్రంలో నయనతార కూడా నటించనుండదట. అలాగే తెలుగులో ఎన్టీఆర్ 30వ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించనుంది అని సినీవర్గాల నుండి వినిపిస్తుంది






























