Samantha: సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.

ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు మీడియా ప్రతినిధి నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఒకప్పుడు ఎంతో అమాయకంగా ఉండే సమంత ఇంత ధైర్యవంతురాలుగా ఎలా మారిందని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ…ఒకప్పుడు తనకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవు చాలా హ్యాపీగా ఉండేదాన్ని అందుకే తెరపై కూడా అలాగే కనిపించేదాన్ని.
ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు పూర్తిగా మారిపోయాయి. నా ప్రయాణంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను అయితే ఆ సమస్యల నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అందుకే ఇంత ధైర్యవంతురాలుగా మారిపోయానని సమంత తెలిపారు. ఈ ప్రయాణంలో సమస్యలతో పోరాడటం కూడా తనకు అలవాటైపోయింది అంటూ సమంత ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha:శకుంతల పాత్రకు నో చెప్పాను…
ఇక శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ రాజీ లాంటి పాత్ర చేసిన తర్వాత శకుంతల పాత్రలో నటించాలి అంటే ముందుగా భయం వేసిందని అందుకే మొదట్లో ఈ సినిమాకి నో చెప్పిన తిరిగి ఈ సినిమాకు ఒప్పుకున్నానని సమంత ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































