శాంసంగ్ సరికొత్త, ప్రత్యేక ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ లు ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మన దేశంలో కూడా లాంచ్ చేసింది. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫాకు తర్వాతి వెర్షన్గా ఈ ల్యాప్టాప్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 11వ తరం ఐ5, ఐ7 ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి.

శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ కి సంబంధించిన ఫ్రీ ఆర్డర్లను శాంసంగ్ అమెరికా వెబ్ సైట్లో లిస్ట్ అయ్యాయి. ఇందులో ఐ5 ప్రాసెసర్ వేరియంట్ రూ.63,000 ఉంది. ఐ7 ప్రాసెసర్ వేరియంట్ ధరను సుమారు రూ.77,700 నిర్ణయించారు. ఈ కొత్త వెర్షన్ ల్యాప్ టాప్ లు బ్లాక్, సిల్వర్ కలర్ లో లాంచ్ అయ్యాయి. అమెరికాలో నిర్ణయించిన ధరలే మన దేశంలో కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
శాంసంగ్ లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ ను టచ్ స్క్రీన్ తరహాలో కూడా ఉపయోగించవచ్చు. దీనిలో 13.3 అంగుళాల ఫుల్ హెచ్డీ ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేను అందించారు.ఐ5 ప్రాసెసర్ వేరియంట్లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ను అందించారు. ఐ7 వేరియంట్లో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఉంది.దీంతోపాటు 720పీ వెబ్ క్యామ్, డ్యూయల్ అరే మైక్రో ఫోన్లు, రెండు 1.5W స్పీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి.దీని మందం 0.55 అంగుళాలుగానూ, బరువు కేవలం 1.18 కేజీలు ఉంది.

































