Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ రోజా. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంకి చెందిన రోజా హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో వెలుగొంది ఆపైన బుల్లితెర మీద కూడా జబర్దస్త్ షో ద్వారా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఇక రాజకీయాల్లోను సక్సెస్ అయి తాజాగా ఏపీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న ఆమె రాబోయే ఎన్నికలలో పార్టీ నుండి టికెట్ ఉండదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద ఇమంది రామారావు మాట్లాడారు.

రోజా విషయంలో జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు…
రోజా వైసీపీ మహిళా నేతగా ప్రతిపక్షాలను బాగా విమర్శిస్తారు. అయితే ఆమె విమర్శలు ఈ మధ్య కాలంలో బాగా శృతి తప్పాయ్. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆమె వ్యక్తిగత విమర్శలను ఎక్కువగా చేస్తుంటారు. ఇక మెగా ఫ్యామిలీ గురించి కూడ ఆమె హద్ధులు దాటి విమర్శలు చేయడం వల్ల జనాల్లో ఆమె మీద వ్యతిరేకత ఎదురయిందని ఇమంది అభిప్రాయపడ్డారు. ఇక సొంత పార్టీ లోనే ఆమె వైఖరి నచ్చని వాళ్ళు ఉన్నారాని ఆయన అభిప్రాయపడ్డారు.

చిత్తూరు జిల్లా అనగానే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేరు వినిపిస్తుంది . ఆ జిల్లాలోనే కాదు ఆయన వైసీపీ లో కూడ జగన్ తరువాత ఆయన అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. అలాంటి ఆయన కు రోజా అంటే అసలు పడదట. ముందు ఎలక్షన్ అపుడే ఆయనకు రోజా కి నగరి టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా జగన్ ఒప్పించారట. ఇక ఇపుడు ఖచ్చితంగా నగరి టికెట్ రోజా కి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారట. క్రితం ఎన్నికలలో కూడ పెద్ద మెజారిటీ ఏమి రోజా కి రానందున ఈసారి ఓడిపోతుందనే అనుమానాలు వినిపిస్తునాయని వైసీపీ పార్టీ భావిస్తోంది అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.

































