బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పోర్నోగ్రఫీ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ ఈ పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా భార్య అయినటువంటి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారణ చేపట్టారు.

ఈ క్రమంలోనే కస్టడీలో ఉన్నటువంటి రాజ్ కుంద్రాను తీసుకొని పోలీసులు అతని నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించడంతో పోలీసులకు పలు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులు శిల్పా శెట్టి దంపతులను విచారిస్తున్న నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది.
రాజ్ కుంద్రా ఈ విధంగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు కావడంతో తన పరువు మొత్తం పోయిందని నటి బావోద్వేగం అయినట్లు సమాచారం. అదేవిధంగా ఈ కేసుల వ్యవహారం వల్ల ఆమెకు వచ్చిన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ కావడంతో ఆమె కెరీర్ పరంగా ఎంతో నష్టపోయినట్లు తెలుస్తోంది.
పోలీసులు రాజ్ కుంద్రాను తీసుకొని జూహులో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో శిల్పాశెట్టి తన భర్తతో గొడవపడ్డారనే సమాచారం వినబడుతోంది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో భాగంగా శిల్పాశెట్టి తన భర్తకు మద్దతుగా నిలిచింది. తన భర్త తీసినది ఫోర్న్ సినిమాలు కాదని ఈ సందర్భంగా శిల్పాశెట్టి వాంగ్మూలం ఇచ్చారు.






























