Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాలలో ఈయన కీలక పాత్రలలో నటిస్తున్నారు ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నటువంటి నందు సింగర్ గీతామాధురిని ప్రేమించే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి వివాహం 2014వ సంవత్సరంలో అయింది. వీరిద్దరికి ఒక చిన్నారి కూడా జన్మించింది అయితే తాజాగా మరోసారి గీత మాధురి తల్లి కాబోతున్నారని తెలిసిందే. ఇటీవల ఈమె ఫిబ్రవరిలో తన ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారంటూ ప్రెగ్నెన్సీ గురించి అసలు విషయం బయట పెట్టారు. అయితే తాజాగా తన కుటుంబం ఈమెకు ఘనంగా సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తుంది.
తాజాగా గీత మాధురి సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఫంక్షన్లో గీత స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. సీమంతం సందదర్భంగా ఆకుపచ్చ, నారింజ రంగు కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసిపోయింది. ఇక వేదికను కూడా రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు.
సాంప్రదాయబద్ధంగా సీమంతం…
ఇలా సాంప్రదాయబద్ధంగా గీతామాధురి సీమంతపు వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజులలో గీతామాధురి ఇంట మరో చిన్నారి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.



























