Tag Archives: actor

Viral Video: నా పెళ్లయిపోతుంది.. ఒక్కసారి తనతో ఫోటో దిగాలంటూ హీరో వద్దకు వెళ్లిన పెళ్లికూతురు.. చివరికి ఏమైందంటే?

Viral Video: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. అయితే తమ అభిమాన నటీనటులతో కలిసి ఒక ఫోటో దిగాలని ఎంతోమంది ఆతృత పడుతుంటారు. ఇలా కొందరు అభిమానులు అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. అయితే తమ అభిమాన హీరో హీరోయిన్లను కలవడం కోసం అభిమానులు చేసే పనులకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇదివరకే ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అభిమానిని అంటూ ఒక వధువు పెళ్లి పీటల పై నుంచి తనతో ఫోటో దిగడం కోసం ఏకంగా తన హోటల్లో బస చేస్తున్న రూమ్ దగ్గరకు వెళ్ళింది.మరికొన్ని గంటలలో తన పెళ్లి జరుగుతుందని కింద తన కోసం పెళ్లి కుమారుడు కూడా ఎదురుచూస్తున్నారు తన అభిమాన నటుడితో ఒక్క ఫోటో దిగుతాను అంటూ ఆమె అక్కడ ఉన్న సెక్యూరిటీని ఎంతో వినయంగా రిక్వెస్ట్ చేశారు.


ఇలా జీవితంలో ఒక్కసారి పెళ్లి జరుగుతుందని తన అభిమాన హీరోతో ఒక్క ఫోటో దిగి తాను వెళ్లిపోతానని ఈమె సెక్యూరిటీని ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ సెక్యూరిటీ మాత్రం తనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా వధువు ఎంత బతిమిలాడినా సెక్యూరిటీ ఒప్పుకోకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగింది.

హీరోతో ఫోటో కోసం ఎంతో ఎదురుచూసిన వధువు..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ అసలు ఆ హీరోతో చివరికి ఫోటో దిగారా లేదా అంటూ కామెంట్లో చేస్తున్నారు. అలాగే మరికొందరు ఎంత స్వీట్గా వధువు రిక్వెస్ట్ చేస్తుంది అంటూ కామెంట్ లు చేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Thammareddy Bharadwaja: చిరంజీవి, మహేష్, ప్రభాస్ ను చూస్తే నాకు తిక్కరేగుతుంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

Thammareddy Bharadwaja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా టికెట్ల వ్యవహారం పై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Thammareddy Bharadwaja: చిరంజీవి, మహేష్, ప్రభాస్ ను చూస్తే నాకు తిక్కరేగుతుంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్?

ఈ సందర్భంగా సినిమా టికెట్ల రేట్లపై ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి మీ సమాధానం , అభిప్రాయం ఏంటి అంటూ ఆయన అని ప్రశ్నించగా అసలు ఇండస్ట్రీలో సమస్య లేదనేది తన ఉద్దేశమని ఈయన తెలియజేశారు.సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

Thammareddy Bharadwaja: చిరంజీవి, మహేష్, ప్రభాస్ ను చూస్తే నాకు తిక్కరేగుతుంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్?

సినిమా టికెట్ల రేట్లను తగ్గించినప్పుడు పెద్ద సినిమా నిర్మాతలు చాలా నష్టపోతారనే విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన చిత్రాలకు భారీ బడ్జెట్ అయ్యింది. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే విడుదల కాలేదు. దేశ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో విడుదల అవుతున్నాయి కనుక సినిమా రేటు తగ్గించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతోంది. అదే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలే అయితే కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే విడుదల అవుతాయి కనుక ఈ సినిమాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.

మౌనంగా ఉన్నామని రెచ్చిపోతున్నారు…

ఇలా పాన్ ఇండియా సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల కావడంతో ఆ సినిమాలకు కూడా ఎలాంటి నష్టం లేదని నా దృష్టిలో ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవని ఆయన వెల్లడించారు. ఇన్ని రోజులు ఏ విషయాన్ని బయటకు ప్రస్తావించక మౌనంగా ఉండి పోతుంటే ఎవడికి వాడు రెచ్చిపోతున్నారు వీళ్ళందర్నీ చూస్తుంటే తిక్క రేగుతుంది అంటూ తమ్మారెడ్డి ఇ వెల్లడించారు. ఇక ముఖ్యంగా చిరంజీవి మహేష్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలు టికెట్ల రేట్లను పెంచమని ముఖ్యమంత్రిని అడుక్కోవడం దారుణమని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

Sampoornesh Babu: హృదయ కాలేయం కొబ్బరిమట్ట వంటి చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఈయన పలు కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.ఈ విధంగా తన నటనతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా తన మంచి మనసుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా సంపూర్ణేష్ బాబు ముందు వరుసలో ఉంటారు.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

ఈ క్రమంలోనే ఇదివరకే ఎన్నోసార్లు ఆపదలో ఉన్న ఈయన తనకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సంకొజి లావణ్య, రమేష్‌ దంపతులరెండు నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు స్వయంగా రమేష్ దంపతులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

పాతిక వేలు ఆర్థిక సహాయం…

ఈ క్రమంలోనే మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్‌ తో పాటు రమేష్ ఇంటికి చేరుకున్న సంపూర్ణేష్ బాబు 25 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ విధంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో నటుడు సంపూర్ణేష్ బాబు పై మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా లావణ్యరమేష్ దంపతులు కూడా నటుడు సంపూర్ణేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు సంపూర్ణేష్ బాబు మనస్తత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

R.Narayana Murthy: ఆర్. నారాయణ మూర్తి.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తూ.. ప్రజల సమస్యలే సినిమా వస్తువులుగా సినిమాలు తీస్తుంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ… ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

తను కోరుకుంటే.. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో పనిచేసే అవకాశం ఉన్నా…డబ్బు కోసం ఏనాడు వెంపర్లాడలేని వ్యక్తిగా ఆర్ నారాయణ మూర్తి నిలుస్తారు. ఇండస్ట్రీలో తనను గౌరవించని వారు ఉండరంటే.. అతిశయోక్తి కాదు.  రైతు కుటుంబంలో జన్మించిన నారాయాణ మూర్తి కాలేజ్ లో చదువుకునేపటప్పుడు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పిని చేశాడు.

R.Narayana Murthy: సింప్లిసిటీకి నిదర్శనం అతడు..! 12 ఎకరాల భూమిని దానం చేసిన నటుడు..!

తిండి, వసతి లేక మద్రాస్ లో ఉండేటప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఏ చదివిన నారాయణ మూర్తి స్నేహితుల సాయంతో ‘‘ అర్థ రాత్రి స్వాతంత్య్రం’’ అనే సినిమాను తెరకెక్కించాడు. 
ఇన్ని ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. కూడా తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు.

ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని…

ఎక్కడికి వెళ్లినా.. ఆటోలో, నడుచుకుంటూ  వెళ్లడం నారాయణ మూర్తి సింప్లిసిటీకి నిదర్శనం. ఇవ్వాళ ఒక్క సినిమాలోనే నటిస్తే కార్లు, బిల్డింగులు వస్తున్నాయి. కానీ దశాబ్ధాలుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ సొంత ఇళ్లు, కారు కూడా లేని నిరాడంబర వ్యక్తి నారాయణ మూర్తి. తనకు ఉన్న 12 ఎకరాల భూమిని దానం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. నారాయణ మూర్తి తల్లి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన కొడుకు ఉన్నది పంచి పెడుతూ ఉంటాడని… హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోమని చెబితే వినలేదని ఆమె అన్నారు. ఇక నారాయణ మూర్తికి చేపల పులుసు, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మని వెల్లడించారు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

Thyagaraju: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో విలన్ పాత్రలో నటించే వారికి కూడా అలాంటి గుర్తింపు ఉంటుంది.ఇలా విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు గురించి ఇప్పటి వారికి తెలియకపోయినా ఎన్టీరామారావు నాగేశ్వరరావు సినిమాలలో ద్వారా ఎంతో అద్భుతంగా నటించారు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

1964 లో మంచి మనిషి చిత్రం ద్వారా విలన్ పాత్రలో నటించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న త్యాగరాజు ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీసాఫీసర్‌ బాస్టన్‌ దొరగా త్యాగరాజు నటన అద్భుతం అని చెప్పవచ్చు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

త్యాగరాజు తన 27 సంవత్సరాల సినీ కెరీర్లో ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు పొందారు.ఈ విధంగా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు యాభై సంవత్సరాల వయసులోనే అర్థంతరంగా కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

గుండెపోటు రావడంతో…

ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న త్యాగరాజు 1991 ఫిబ్రవరి 24వ తేదీ హైదరాబాద్లోని అశోక్ నగర్ లో తన సోదరుడి ఇంటిలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈయన మృతి చెందారు. ఇలా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలకి మృతిచెందిన నటుడు త్యాగరాజు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

Sampath Raj: పెళ్లి విషయంలో ఆ తప్పు కారణంగా విడాకులు తీసుకున్నాం.. సంపత్ రాజ్ కామెంట్స్!

Sampath Raj:టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మొదటగా దమ్ము, పంజా సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇలా మిర్చి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయనకు వరుస అవకాశాలు వచ్చాయి.

Sampath Raj: పెళ్లి విషయంలో ఆ తప్పు కారణంగా విడాకులు తీసుకున్నాం.. సంపత్ రాజ్ కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ విలన్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ నటుడు తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంపత్ రాజ్ ఎన్నో విషయాల గురించి చర్చించారు.ముఖ్యంగా తన విడాకుల విషయం గురించి సంపత్ రాజ్ ఈ సందర్భంగా బయటపెట్టారు.

Sampath Raj: పెళ్లి విషయంలో ఆ తప్పు కారణంగా విడాకులు తీసుకున్నాం.. సంపత్ రాజ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తనకు తన భార్యకు సఖ్యత లేకపోవడం కారణంగా విడాకులు తీసుకున్నానని విడాకులు తీసుకోవడంతో తన కూతురు చాలా బాధ పడిందని ఆయన తెలియజేశారు.అసలు విడాకులు తీసుకోవడానికి కూడా కారణం పెళ్లి విషయంలో చేసిన చిన్న తప్పు అని వెల్లడించారు.

అడ్వర్టైజింగ్ కంపెనీ ఉండేది..

చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అవగాహన లేక పోయింది. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని సంపత్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు.అందుకే చిన్న వయసు లోనే ఎవరు పెళ్లి చేసుకోవద్దని తన కూతురికి కూడా ఇదే విషయాన్ని బాగా అర్థమయ్యేలా తెలియజేశారని నటుడు తెలిపారు. విడాకుల తర్వాత తన కూతురికి అన్నీ తానే చూసుకున్నట్లు తెలిపారు.సినిమాలలోకి రాకముందు అడ్వర్టైజింగ్ కంపెనీ ఉండేదని కన్నడలో ఓ సినిమా చేస్తున్న సమయంలో విడాకులు అయ్యాయని తెలిపారు.ఇక తనకు బాలీవుడ్లో అవకాశాలు కూడా వస్తున్నాయని అయితే సరైన కథనం దొరికినప్పుడే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానని నటుడు సంపత్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు… ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియల్స్ లో తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేక రామకృష్ణ గురించి అందరికీ తెలిసిందే.ఈయన పేరు చెబితే బహుశా గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఇతనిని చూస్తే మాత్రం అందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి అని మాత్రం తెలుస్తుంది.ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన మేక రామకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రొడక్షన్ హౌస్ లో చిన్న ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి వెల్లడించారు.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు…ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

సాధారణంగా ప్రొడక్షన్ హౌస్లో మన క్యాటగిరిని బట్టి మనకు విలువ ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అడుక్కునే వాళ్లకి కూడా మనం మర్యాదగా వాళ్లకి కావాల్సిన వస్తువులను చేతితో ఇస్తాం కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆర్టిస్టులను అంత కన్నా దారుణంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ప్రొడక్షన్ బాయ్స్ చేష్టలకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

Meka Ramakrishna: టీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చేవారు…ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నా: మేక రామకృష్ణ

ఇండస్ట్రీలో సాధారణంగా కేటగిరీలను బట్టి వారికి ఫుడ్ అందిస్తూ వుంటారు. పొరపాటున కేటగిరికి కాకుండా వేరే క్యాటగిరి దగ్గరకు వెళ్తే అక్కడ ప్రొడక్షన్ బాయ్స్ ఎంతో నీచంగా మాట్లాడతారని… ఎన్నోసార్లు వారిని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనీ తెలిపారు.అయితే ప్రొడక్షన్ బాయ్స్ చేసే ఈ పనులన్నీ దర్శక నిర్మాతలకు తెలియవుపొరపాటున ప్రొడక్షన్ బాయ్స్ ని తిడితే వారికి కాఫీలో మోషన్ టాబ్లెట్ కల్పించడం. టాయిలెట్ లో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం వంటివి చేస్తుంటారు.


నీకు అంత రేంజ్ లేదన్నారు..

అయితే ప్రొడక్షన్ హౌస్ లో అందరూ అలాగే ఉంటారా అంటే ఉండరని కొందరు గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు.ఒక సమయంలో సెట్లో ఎనిమిది మందితో కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్స్ మిగిలిన ఏడుగురికి వేడి అన్నం పెట్టి నాకు మాత్రం బయట నుంచి తెప్పించిన భోజనం పెట్టారు. అదే నాకు కూడా అదే పెట్టొచ్చు కదా అని అడిగితే నీకు అంత రేంజ్ లేదని చెప్పారు. ఇలా అందరి ముందు అనడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని ఆ అవమానంతో చచ్చిపోవాలనుకున్నానని ఈ సందర్భంగా మేక రామకృష్ణ ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుల బతుకులు ఏ విధంగా ఉంటాయో తెలిపారు.

Sampath Raj: ఆమె నా భార్య కాదు.. ఫ్రెండ్ మాత్రమే.. పుకార్లకు మరో సారి చెక్ పెట్టిన సంపత్ రాజ్!

Sampath Raj:అప్పటి వరకూ ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించిన రాని గుర్తింపు కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమా ద్వారా గుర్తింపు వచ్చిందని నటుడు సంపత్ రాజ్ తెలిపారు.మిర్చి సినిమా ద్వారా విలన్ పాత్రలో అందరికీ సుపరిచితమైన సంపత్ రాజ్ అనంతరం ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో విలన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సంపత్ రాజ్ మాట్లాడుతూ… తన ఫ్యామిలీ గురించి తన కెరీర్ గురించి ఆశక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక నటి శరణ్య సంపత్ రాజ్ భార్యాభర్తలు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో షికార్లు కొట్టింది.

ఆ నటితో తనకున్న సంబంధం గురించి క్లారిటీ ఇచ్చిన.. టాలీవుడ్ విలన్ సంపత్ రాజ్!

ఈ కార్యక్రమం ద్వారా సంపత్ రాజ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరణ్య ఫ్యామిలీ,మా ఫ్యామిలీ చాలా క్లోజ్ అని, తన భర్త నేను మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని తెలిపారు. అయితే మేమిద్దరం కలిసి ఒక సినిమాలో భార్యాభర్తలుగా నటించామని అదే విషయాన్ని కొందరు మేము భార్య భర్తలనీ రాశారని ఈ సందర్భంగా వారి గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.

ఆ దర్శకుడికి వారికి ఇచ్చిన సంపత్ రాజ్…

ఈ క్రమంలోనే ఒక దర్శకుడికి వార్నింగ్ ఇచ్చారట కదా.. సినిమాలో అవకాశం ఇవ్వకపోతే కెమెరాలు ఎత్తుకెళ్లి పోతానని వార్నింగ్ ఇచ్చారని అలీ అడగడంతో అందుకు సంపత్ సమాధానం చెబుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా చేయబోతున్నారు ఈ క్రమంలోనే అందులో నాకు ఛాన్స్ ఇవ్వకపోతే కెమెరాలన్ని ఎత్తుకెళ్లి పోతా అంటూ తనకు సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చానని ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

Kaikala Satyanarayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన విషయం మనకు తెలిసిందే.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

ఇలా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కైకాల ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అనారోగ్య సమస్య చేసినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సహాయం అందించి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంతో కైకాల సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేయడమే కాకుండా తన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీ సహాయం నా కుటుంబానికి శక్తినిచ్చింది..

అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైనప్పుడు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా వ్యక్తిగతంగా నన్ను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి నాకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు చెప్పిన విధంగానే ఉన్నతాధికారులు నన్ను సంప్రదించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు చేసిన సహాయం నాకు నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని, కళాకారుల పట్ల మీరు చూపిస్తున్న గౌరవం, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే రాష్ట్రం మంచి చేతులలో ఉందనే భరోసా వస్తుందని కైకాల పేర్కొన్నారు.

Sachin Joshi: సచిన్ జోషికి షాక్ ఇచ్చిన ఈడీ..! కోట్ల ఆస్తులు జప్తు..!

Sachin Joshi: సచిన్ జోషి టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో అనేక సినిమాల్లో హీరో కనిపించారు. దీంతోపాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు.

Sachin Joshi: సచిన్ జోషికి షాక్ ఇచ్చిన ఈడీ..! కోట్ల ఆస్తులు జప్తు..!

గతంలో విజయమాల్య సంబంధించిన విల్లా కూడా కొనుగోలు చేసి వార్తల్లో కూడా నిలిచారు. సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించారు. మ్యూజికల్ గా ఆ సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది.

Sachin Joshi: సచిన్ జోషికి షాక్ ఇచ్చిన ఈడీ..! కోట్ల ఆస్తులు జప్తు..!

ఇదిలా ఉండగా.. ఒరేయ్ పండు, నిన్ను చూడక నేనుండలేను. జాక్ పాట్ నీ జతగా నేనుండాలి సినిమాల్లో నటించారు. చివరగా 2017 లో వీడెవడు సినిమాలు కనిపించారు. గతంలో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ లు నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోనూ కనిపించారు. ఆ సమయంలో టాలీవుడ్ తరపున క్రికెట్ ఆడారు.


కోట్ల రూపాయలను జప్తు చేయడం..

అయితే తాజాగా సచిన్ జోషి ఓ వివాదంలో ఇరుక్కున్నారు. సచిన్ జోషి సంబంధించి ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  జప్తు చేసింది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కొన్ని కోట్ల రూపాయలను జప్తు చేయడం చర్చకు దారి తీసింది. శనివారం ఈడీ రూ. 410 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ. 330 కోట్లు విలువైన ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషి కి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవి. ఎస్ ఆర్ ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కిందటేడాది సచిన్ జోషి అరెస్టయ్యారు.