Tag Archives: Movie news

Ram Charan: సినీ పరిశ్రమలో అతడే స్పూర్తి.. ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ram Charan: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దీనిని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నడుస్తున్నాయి. మొన్న ముంబాయ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. తాజగా తమిళనాడులో జరిగింది.

Ram Charan: సినీ పరిశ్రమలో అతడే స్పూర్తి.. ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం విధితమే. తాజాగా రామ్ చరణ్ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Ram Charan: సినీ పరిశ్రమలో అతడే స్పూర్తి.. ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

రామ్ చరణ్ తండ్రి చిరంజీవి తనకు ఇచ్చిన ఓ ఉత్తమ సలహా గురించి మాట్లాడారు. కెరీర్ సుదీర్ఘకాలంగా కొనసాగాలంటే.. క్రమశిక్షణ అవసరం అని.. అదే విషయాన్ని తనకు సూచించాడని చెప్పాడు. ఇక తనకు సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో ఎలా కొనసాగాలో తెలిపేందుకు నాకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ఫూర్తి అన్నారు.

వయస్సుతో సంబంధం లేకుండా..

అక్షయ్ కుమార్ వయస్సుతో సంబంధం లేకుండా.. ఫిట్‌గా.. ఎనర్జిటిక్‌గా విజయవంతంగా కొనసాగాలంటే.. తాను అక్షయ్ కుమార్ నే ఎక్కువగా ఫాలో అవుతానన్నారు. ఇక చిరంజీవితో కలిసి ఇతడు నటిస్తున్న చిత్రం ఆచార్య.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాదు.. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్.. రెండు నుంచి మూడు ప్రాజెక్ట్ లను ఒప్పుకున్నట్లు సమాచారం.

విజయ్ సేతుపతితో సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రం.. దర్శకుడు ఎవరంటే?

ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులో కూడా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విజయ్ సేతుపతి హీరో సందీప్ కిషన్ తో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్‌ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకు విడుదలైన “ది ఫ్యామిలీ మెన్”,  ‘స్త్రీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికీ దర్శకుడు వీరితో కలిసి సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

ఇదివరకే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ మెన్ ఫస్ట్ సిరీస్ లో సందీప్ కిషన్ నటించారు. అదే విధంగా రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్‌లో రానున్న “సన్నీ”(వర్కింగ్ టైటిల్) వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వేరువేరు చిత్రాల ద్వారా పరిచయమైన ఈ హీరో లిద్దరినీ ఒకే సినిమాలో చూపించబోతున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న టువంటి ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న.. చరణ్ -శంకర్ సినిమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి కాగానే చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పటికే శంకర్ ఈ సినిమాను ఎక్కడ చిత్రీకరించాలనే విషయాల గురించి ఆలోచించాడని అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల నుంచి వీరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం వినబడుతుంది. ఎక్కువభాగం ఈ చిత్రాన్ని శంకర్ ఇండియాలోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని..ఇండియాలో కూడా ఎక్కువ భాగం తెలంగాణలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 8న సినిమా షూటింగ్ ప్రారంభం కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది జూలై నాటికి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబోలో తెలుగులో “వినయ విధేయ రామ” తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే చెర్రీ సరసన నటించారు. ఇక ఆచార్య సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

క్లైమాక్స్ కోసం చెమటలు చిందిస్తున్న మెగా హీరో!

సాధారణంగా సినిమాలలో నటించే హీరోలు ఎప్పుడు ఓకే స్టైల్ మెయింటెన్ చేయాలంటే కుదరని పని. ఒక్కో సినిమాకు ఒక్కో విధమైనటువంటి స్టైల్, శరీరాకృతిని మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కథానుసారంగా వారి శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోలు కథకు తగ్గట్టుగా శరీరాకృతిని మెయింటైన్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు.

ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నటించే హీరోల శరీరాకృతి కండలు తిరిగి ఉండాల్సిందే. ఇలాంటి పాత్రలలో నటించే హీరోలు అధిక మొత్తంలో చెమట చిందించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈవిధంగా చెమటలు చెందించి కండలు తిరిగే శరీరాకృతిని మెయింటైన్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో “గని” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కండలు తిరిగిన శరీరం పెంచడంకోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్ లో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ  ‘హార్డ్‌వర్క్‌కు బ్యాక్‌ అప్‌ అంటూ ఉండదు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయూ మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది.

పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్టు కాగానే.. సాక్షాలు నాశనమయ్యాయి?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారింది.బాలీవుడ్ నటి శిల్పా భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో గత రెండు వారాల క్రితం ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాను అరెస్టు చేసినప్పటి నుంచి పోలీసులు ఈ కేసును పలు కోణాలలో విచారిస్తున్నారు.ఈ కేసును ఆరా తీసేకొద్దీ పలు ఆసక్తికరమైన సంఘటనలు బయటపడుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పోర్నోగ్రఫీ కేసు ద్వారా రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీలోకి తీసుకోగానే ఆ కేసుకు సంబంధించిన పలు సాక్షాలన్నింటిని నాశనం చేశారని ముంబై హైకోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ పాయ్ వెల్లడించారు.రాజ్ కుంద్రా అరెస్ట్ అవుతాడని ముందుగా గ్రహించడం చేతనే ఈ సాక్షాలు అన్నింటిని నాశనం చేశారని, తన వాట్సాప్ చాట్,హాట్ షాట్ బోలీ ఫేమ్ యాప్ లను ముందుగానే నాశనం చేసినట్లు తెలిపారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోకుండా రాజ్ కుంద్రా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాత్రం ఈ రెండు వెబ్ సైట్ల నుంచి సుమారు 50కి పైగా అశ్లీల చిత్రాల వీడియోలను సేకరించినట్లు తెలిపారు. రాజ్ కుంద్రా తీసిన ఈ పోర్నోగ్రఫీ వీడియోలను హాట్ షాట్ యాప్ లోఅప్లోడ్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు అనే ఆరోపణలు రావడం చేతనే గతవారం అతనికి బెయిల్ రద్దయిందని తెలిపారు.

ఈ విధంగా తన అరెస్టు గురించి ముందుగా గ్రహించి సాక్ష్యాధారాలను నాశనం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను వినిపించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేపట్టే వరకు అతనికి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తనని డిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ముందు ముందు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఎలాంటి నిజాలు బయట పడతాయన్న విషయం ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

శ్రీయ పాత్రలో రెజీనా.. బాలీవుడ్ లో అవకాశం?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం “ఛత్రపతి”. 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ విజయంగా నిలిచింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

“ఛత్రపతి” రీమేక్ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి సమక్షంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. “ఛత్రపతి” సినిమాను రీమేక్ ను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ పాత్రలో నటించడం కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా
క‌సాండ్రా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి “ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక “ఛత్రపతి”సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు ఇది రెండవ బాలీవుడ్ చిత్రం అని చెప్పవచ్చు.

మహేష్, త్రివిక్రమ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఈ చిత్రం పూర్తి కాగానే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఇదివరకే వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ, టీవీలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.అయితే ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు టైటిల్ ఇదే అంటూ ఒక టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు రెండు మూడు టైటిల్స్ వినిపించినప్పటికీ.. ప్రస్తుతం ఈ సినిమాకు “అతడే పార్ధు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం పలువురు తారల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి త్రివిక్రమ్ మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు నటిస్తారనే విషయం పై అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

చెర్రీ సినిమా పై యూటర్న్ తీసుకున్న డైరెక్టర్ శంకర్.. ఫాన్స్ ఆశలను అడియాశలు చేస్తూ..?

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ కేవలం అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి సారించిన ఈ హీరో వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ సందడి చేయనున్నారు.అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో తన తండ్రితో కలిసి వెండితెరను పంచుకోనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే చెర్రీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని వార్తలు జోరుగా వినిపించాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో ఏకంగా ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఎంతో అట్టహాసంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే చిత్ర బృందం ప్లాన్ చేశారు. శంకర్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే శంకర్ చెర్రీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్ర బృందం ముందుగా ఆరు భాషలలో విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ సినిమాను కేవలం హిందీ, తెలుగు, తమిళ భాషలలో మాత్రమే విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలపై శంకర్ నీళ్లు చల్లినట్లు అయ్యింది.ఈ క్రమంలోనే అభిమానులు శంకర్ చెర్రీ సినిమా విషయంలో ఎందుకిలా యూటర్న్ తీసుకున్నాడనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన మహేష్ బాబు.. రిపీట్ కాకూడదంటూ వార్నింగ్?

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన్నప్పటికీ మొదటి షెడ్యూల్ ని మాత్రమే పూర్తిచేసుకుంది.

కరోనా కారణం చేత సినిమా షూటింగ్ వాయిదా పడింది.ప్రస్తుతం రెండవ షెడ్యూల్ విదేశాలలో ప్లాన్ చేయడంతో పరిస్థితులు అనుకూలించక రెండవ షెడ్యూల్ లో పలు మార్పులు చేసి హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

పని విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపించే మహేష్ బాబు ఒక విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై చిత్ర బృందానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మహేష్ బాబు నటిస్తున్నటువంటి సర్కారీ వారి పాట చిత్రానికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు ఇప్పటికే ఎన్నోసార్లు లీకైన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా సినిమా నుంచి ఫోటోలు వీడియోలు లీక్ కావడంతో మహేష్ బాబు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై మహేష్ బాబు చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయమై మరొకసారి రిపీట్ అయితే బాగుంటుంది చిత్ర బృందాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

వెండితెర అరంగ్రేటం పై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి కూతురు సుప్రీత..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే అలాగే సురేఖవాణి గారాల కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో చలాకీగా,ఉత్సాహంగా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.

సుప్రిత నిత్యం ఏదో రకమైన పోస్టులతో సోషల్ మీడియాను అదరగొడుతూ అత్యధిక ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. అలాగే వీలున్నప్పుడల్లా అభిమానులతో లైవ్లో చిట్ చాట్ నిర్వహించి తనదైన స్టైల్లో సమాధానాలు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సురేఖ తన కూతురిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా సురేఖ వాణి గారాల కూతురు సుప్రీత లైవ్ చాట్ నిర్వహించగా అందులో ఓ అభిమాని సుప్రీతనీ మీరు టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని అడగగా దానికి సమాధానంగా కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ ప్రస్తుతం చదువు పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాను, అలాగే తనకిష్టమైన నటన మరియు డ్యాన్సు నేర్చుకోవడానికి తగిన శిక్షణ తీసుకుంటున్నానని ముఖ్యంగా డైలాగ్ స్పష్టంగా చెప్పడం కోసం, మాట్లాడటానికి ఒక గురువు సహాయం తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసింది. నటన మీద ఆసక్తి ఉన్నప్పటికీ టాలీవుడ్ ఎంట్రీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సుప్రీత తెలియజేస్తూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.