Tag Archives: naga shourya

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి నాగశౌర్య బంధువా… అసలు విషయం బయట పెట్టిన నాగశౌర్య తల్లి!

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా పరిచయమైన నాగశౌర్య ఎంతో విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకొని హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగశౌర్య చందమామ కథలు సినిమా సమయంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి నాగశౌర్య బంధువు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి నాగశౌర్య బంధువా… అసలు విషయం బయట పెట్టిన నాగశౌర్య తల్లి!

నాగశౌర్య ఎన్టీఆర్ భార్య ప్రణతి కజిన్ బ్రదర్ అనే ఊహాగానాలు వినిపించాయి.ఈ విధంగా అప్పటి నుంచి ఎన్టీఆర్, నాగశౌర్య బంధువులు అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే నాగశౌర్య తల్లి ఉషారాణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం గురించి వెల్లడించారు.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి నాగశౌర్య బంధువా… అసలు విషయం బయట పెట్టిన నాగశౌర్య తల్లి!

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి కజిన్ బ్రదరే నాగ శౌర్య అని వార్తలు వచ్చాయి ఇది నిజమేనా అని ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు ఉషారాణి సమాధానం చెబుతూ అసలు విషయం వెల్లడించారు. నాగ శౌర్య ఎన్టీఆర్ ఫ్యామిలీ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఉషారాణి తెలిపారు.

ఎలాంటి రిలేషన్ లేదు…

తారక్ అంటే మా అందరికీ ఎంతో అభిమానం. అంతేకానీ ఇలాంటి రిలేషన్ లేదని తెలిపారు. ప్రణతి వాళ్ల కజిన్ నాగ శౌర్యకి ఫ్రెండ్. అలా వీరి గురించి రూమర్స్ వచ్చి ఉంటాయి కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదని ఉషారాణి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

Hero Nani – Nagashaurya: సాధారణంగా ఒకే కథాంశం ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒక లైన్ ప్రేరణగా తీసుకొని వివిధ రకాలుగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు.అయితే తాజాగా ఇలా ఒకే పాయింట్ తీసుకొని నాని, నాగశౌర్య ఇద్దరు ఒకే కథతో రెండు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

కరోనా రాకముందు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా కృష్ణ బృందా విహరి సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాలో నాగసౌర్య బ్రాహ్మణ కుర్రాడుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఇందులో కూడా నాని బ్రాహ్మణ కుర్రాడిగా సందడి చేయనున్నారు. ఇలా ఒకే కథతో రెండు సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలలో ఇద్దరు కూడా బ్రాహ్మణ కుర్రాళ్ళుగా కనిపించడమే కాకుండా వీరి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకే విధంగా ఉన్నట్లు సమాచారం.

అంచనాలను పెంచిన నాని….

మరి బ్రాహ్మణ గెటప్ ఈ హీరోలకు ఎవరికి కలిసి వస్తుంది.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఎలాంటి విజయాలను అందుకుంటారో తెలియాల్సి ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

బ్రేకింగ్ న్యూస్: ఫామ్ హౌస్ పేకాట కేసులో భాగంగా నాగశౌర్య తండ్రి అరెస్ట్..!

గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. అయితేహీరో నాగ సౌర్య తండ్రికి సంబంధించిన ఫాంహౌస్ లో వీరందరూ అరెస్టు కావడంతో ఈ కేసుకు నాగసౌర్య తండ్రికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందా అంటూ పోలీసులు విచారణ జరిపారు.

ఈ విచారణలో భాగంగా క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలసి నాగసౌర్య తండ్రిశివలింగ ప్రసాద్ పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలను సేకరించడంతో వెంటనే పోలీసులు నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతనిని ఉప్పర్‌పల్లి కోర్టుకు హాజరు పరచడంతో తన తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

నిన్నటి వరకు ఈ పేకాట దందాతో నాగశౌర్య తండ్రికి ఏమాత్రం సంబంధం లేదని కేవలం ఫాంహౌస్ మాత్రమే అతని పేరు పై ఉందని ఈ వ్యవహారంలో నాగశౌర్య బాబాయి ఉన్నారంటూ వార్తలు వినిపించినప్పటికీ పోలీసులు పలు కీలకమైన ఆధారాలు సేకరించడంతో ఈ పేకాట దందాలో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పేరు బయటపడింది.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుమారు ముప్పై మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా నిజామాబాద్, విజయవాడ నుంచి బడాబాబులు అక్కడికి చేరుకొని పేకాట ఆడుతున్నట్లు పోలీసులు వారి విచారణలో వెల్లడించారు.

పేకాటకేసులో బయటపడిన నిజాలు.. నాగశౌర్య తండ్రికి నోటీసులు..!

హైదరాబాద్ నగర శివారులో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడులు జరపడంతో పేకాట రాయుళ్లు అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిందితులు మొత్తం నాగసౌర్య పేరు మీద ఉన్నటువంటి ఫామ్ హౌస్ అరెస్టు కావడంతో ఈ కేసుకు నాగశౌర్యకి ఏమైనా సంబంధం ఉందా అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు విచారణలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

నగర శివార్లలో ఈ ఒక్క ఫాంహౌస్ లోనే కాకుండా అనేక ఫామ్ హౌస్ లలో ఈ విధమైనటువంటి దందా కొనసాగుతుందని నాగశౌర్య ఫాంహౌస్లో పట్టుబడిన గుత్తా సుమంత్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే పోలీసులు సుమంత్ ఫోన్ చేయడంతో దిమ్మతిరిగిపోయే నిజాలు బయటపడుతున్నాయి.

సుమంత్ ప్రతి ఒక్క ఫామ్ హౌస్ కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో సుమారు 200 మంది వరకు పేకాటరాయుళ్లు ఉన్నారని వీరందరూ కూడా బడాబాబులు అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించారు.ఇక్కడికి పేకాట ఆడటానికి వచ్చే వారి కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

చిప్స్ తో నడిచే ఈ దందాలో కార్డ్ స్వైపింగ్, లిక్విడ్ క్యాష్ తో కూడా రావచ్చు అక్కడికి వచ్చే వారికి అన్ని ఫెసిలిటీస్ సుమంత్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పేకాట వ్యవహారంలో బుజ్జి అనే వ్యక్తి పేరు బయటపడుతుంది. అసలు ఈ బుజ్జి ఎవరు అనే విషయానికి వస్తే ఈయన స్వయానా నాగసౌర్య బాబాయి.నాగ శౌర్య తండ్రి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నప్పటికీ ఆ ఫామ్ హౌస్ వ్యవహారాలన్నీ బుజ్జి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఫామ్ హౌస్ నాగశౌర్య తండ్రి పేరు మీద ఉండడంతో అతని తండ్రి పేరు పై పోలీసులు అతనికి నోటీసులను జారీ చేశారు.

వరుడు కావలెను దర్శకురాలు గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?

నాగ శౌర్య, రీతు వర్మ హీరో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. ఈ సినిమా రేపు విడుదల సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మీడియాతో పలు ఆసక్తికర విషయాల గురించి చర్చించారు లక్ష్మీ సౌజన్య పుట్టిందీ కర్నూలు జిల్లాలో అయితే పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట.

లక్ష్మి వాళ్ళ నాన్న మ్యాథ్స్ లెక్చరర్. ఈమె పదకొండేళ్ళకే పదో తరగతి ఎగ్జామ్ రాసిందట. ఈమెకు చిన్నప్పటినుంచీ నలుగురితో కలిసి ఉండటం, కలిసి తిరగటం లాంటివి ఇష్టమట. అందుకే ఆమెకు సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ కరెక్ట్ అనిపించిందట. తనకు పద్దెనిమిదేళ్ల వయసులో ఇంట్లో పెళ్లి చేస్తానంటే వారిని ఎదిరించి మరీ హైదరాబాదుకు వచ్చిందట. అలా శేఖర్ కమ్ముల, తేజ, కృష్ణవంశీ, ప్రకాష్ కోవెలమూడి లాంటిమంచి మంచి డైరెక్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిందట.

ఇలా ఇండస్ట్రీలో పదిహేనేళ్ల జర్నీ తర్వాత ఈమె వరుడు కావలెను సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతోందట. ఇక ఈ కథలో 2017లో చిన్నబాబు కూడా చెప్పగా, స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ ప్రదేశం వరకు అతడికి అంతా నచ్చిందట. అలా ఈ సినిమా కథ మొదలైంది.ప్యాండమిక్ సిచువేషన్ వల్ల రెండేళ్లు ఆలస్యం అయ్యింది. హారిక హాసిని క్రియేషన్స్ ఇలాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అని తెలిపింది.

ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టుగానే భూమికి ఉన్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అని తెలిసింది. ఇందులో హీరోయిన్ కు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటి వాళ్ళకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అంతే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం లాంటిది చేయదు. అందుకే పర్యావరణానికి ఇబ్బందిలేని ఏకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. మరి అలాంటి అమ్మాయిని ప్రేమించాలి అంటే తన కంటే అబ్బాయిల్లో ఎక్కువ కలిసి ఉండాలి. అవన్నీ నాగశౌర్య లో ఉన్నాయి అని తెలిపింది లక్ష్మీ సౌజన్య.

పెళ్లి పై స్పందించిన వరుడు కావలెను హీరోయిన్.. తన పెళ్లి అప్పుడే?

నాగశౌర్య, కలిసి రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల అక్టోబర్ 29న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

రీతు వర్మ మొదట పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.ఇటీవల హీరో నాని నటించిన టక్‌ జగదీష్‌ చిత్రంలో నటించి అలరించింది. ఇందులో ఈమె బలమైన పాత్రలో నటించి మెప్పించింది. నానికి దీటుగా నటించింది. ఇక ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి వరుడు కావలెను చిత్రంతో రాబోతుంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మ్యారేజ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. అయితే రీతూ వర్మ తాజా మీడియాతో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో మ్యారేజ్‌ చేసుకోనని తెలిపింది. అంతేకాదు ఎప్పుడు చేసుకోబోయేది తెలిపింది. ఇంకా తన మ్యారేజ్‌ రెండుమూడేళ్లు అవుతుందని తెలిపింది.

అయితే మ్యారేజ్‌ విషయంలో ఇంట్లో నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపింది. పెళ్లిపై తనకు ఫ్రీడమ్‌ ఇచ్చారని, అయితే అప్పుడప్పుడు పెళ్లెప్పుడని సరదాగా ఆటపట్టిస్తుంటారని పేర్కొంది రీతూ వర్మ. మ్యారేజ్‌ చేసుకునేది పూర్తిగా తన ఇష్టమని చెప్పొంది. ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్‌ పెట్టినట్టు చెప్పింది. అయితే ఏది పడితే అది చేయనని, పాత్రకి ప్రాధాన్యత పాత్రలనే ఎంచుకుని,నచ్చిన సినిమాలే చేస్తానని చెప్పింది రీతూ వర్మ.

ప్రస్తుతం నటిస్తూ వరుడు కావలెను చిత్రం గురించి చెబుతూ, ఇందులో భూమి పాత్రలో కనిపిస్తానని, పాత్ర సవాల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందుకే నో చెప్పకుండా నటించినట్టు చెప్పింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇదని చెప్పింది. ఇది పూర్తిగా లవ్‌ స్టోరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుందని తెలిపింది. కాకపోతే దర్శకు రాలు లక్ష్మీ సౌజన్య మహిళ కావడంతో, ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సాగుతుందని పేర్కొంది.

నన్ను ఇంట్లో మనిషిగా భావించేవారు.. పూజా హెగ్డే!

నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. పి డి వి ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాన్ని ఈ చిత్ర యూనిట్ నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హాజరయ్యింది. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. హీరోయిన్ ని అతిథిగా పిలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఆ క్రెడిట్ అంతా కూడా చిన్న బాబు వంశీ లకు దక్కుతుంది అని తెలిపింది. హారిక అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్.

చిన్న బాబు గారు నన్ను ఇంట్లో మనుషిలా చూస్తారు అని తెలిపింది. దర్శకురాలు లక్ష్మి గారికి ఈ వరుడు కావలెను సినిమా మంచి సక్సెస్ రావాలి. ఈ వరుడు కావలెను సినిమాలను థియేటర్స్ లో ఫ్యామిలీ తో చూడాలి అనీ పూజా హెగ్డే తెలిపారు. సినిమా సూపర్ హిట్ అయ్యి ఈ చిత్ర బృందానికి మంచి పేరు లాభాలు రావాలి. ఇదే ఆనందంతో సక్సెస్ పార్టీలో కలుద్దాం అని పూజా హెగ్డే తెలిపింది.

ఈ కార్యక్రమంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ, నాగ శౌర్య, రీతు వర్మ, లక్ష్మీ సౌజన్య, దేవర నాగ వంశీ, విశాల్ చంద్రశేఖర్ దితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా శ్రేయ ఘోషల్ పాటలను ఆలపించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకట్టుకుంటున్న వరుడు కావలెను ట్రైలర్.. విభిన్నమైన కాన్సెప్ట్ తో అలా!

లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల చేత వాయిదా పడుతోంది.చివరికి ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటుచేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉన్నటువంటి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. పెళ్లిచూపులు నచ్చవు అనే కాన్సెప్టుతో మొదలయ్యే ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ శౌర్య, రీతు భూమి, ఆకాష్ పాత్రలలో కనిపించనున్నారు.

భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అంటూ ఉన్న వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఏ కారణాల చేత వారిద్దరూ విడిపోయారు అనే విషయం ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో వెన్నెలకిషోర్ చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి. పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ఆవిడే విన్నర్ అంటూ వెన్నెల కిషోర్ డైలాగులు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఈ ట్రైలర్ లో రీతూవర్మను హైలెట్ చేసి చూపించారు. ఇలా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండ్అవుతుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

దసరా కానుకగా వరుడు కావలెను.. అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం..

యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. దసరా రోజు అంటే అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రీతు వర్మ నాని సరసన నటించిన టక్ జగదీశ్ హిట్ టాక్ తెచ్చుకుంది. టక్ జగదీశ్ తర్వాత రీతు వర్మ నటించిన సీనిమా ఇదే. ఇది కూడా దసరా నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ విడుదల చేయగా.. ఓ రేంజిలో వ్యూస్ తెచ్చుకుంటోంది. ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. దీనికి థమన్ సంగీతం వహించగా.. శేఖర్ మాస్టార్ కోరియోగ్రాఫర్ గా వహించాడు. ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది.

అలాంటి చిత్రాలలో నటిస్తామంటే అస్సలు కుదరదు: నటి రాశీ ఖన్నా

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా
రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం “ఊహలు గుసగుసలాడే”.ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తక్కువైనప్పటికీ తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా నాగచైతన్య సరసన “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ సందర్భంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఏవిధంగా ఉండాలనే విషయాలను గురించి వెల్లడించారు. ఎప్పుడు ఓకే పంథాలో  కొనసాగాలంటే ఇండస్ట్రీలో కుదరదు.. ఇండస్ట్రీలో అనుభవం పెరిగే కొద్దీ కొత్త కొత్త మార్గాలను అన్వేషించాలని ఈ బ్యూటీ చెబుతోంది. కెరియర్ మొదట్లో ప్రతి ఒక్క హీరోయిన్ గ్లామరస్ పాత్రల ద్వారా లేదా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే ఎప్పుడు ఇలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంటే కుదరదు.

ఇండస్ట్రీలో ఓ దశకు వచ్చాక కచ్చితంగా వేర్వేరు దారులలో ప్రయాణించాల్సి ఉంటుంది.ఈ విధంగా నటనా ప్రాధాన్యత గ్లామరస్ పాత్రలను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇండస్ట్రీలో కొంత కాలం పాటు నిలవగలము ఎప్పుడైతే మనలో విభిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయో అప్పుడే మనకు అవకాశాలు కూడా వస్తాయని ఎప్పుడు కమర్షియల్ చిత్రాలలోనే నటిస్తానంటే అస్సలు కుదరదంటూ ఈ సందర్భంగా
రాశీ ఖన్నా తెలిపారు.