Tag Archives: samantha akkineni

Samantha: సమంత తీసుకున్న ఆ నిర్ణయం వల్ల 12 కోట్లు నష్టమా… అసలు ఏం జరిగిందో తెలుసా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.ఈమె ఆరోగ్యంపై దృష్టి పెడుతూ కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చి అనంతరం సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకున్నారు.సమంత విడాకుల తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఈమెకు పూర్తిగా అనారోగ్యం చేయడంతో తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.

ఈ విధంగా తన సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్నటువంటి సమంత మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతూ అడ్వాన్సులు కూడా తీసుకున్నారు.అయితే గతంలో ఈ మాయోసైటిసిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి కారణంగా మరోసారి సమంత బాగా సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.

ఎలాంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా పూర్తిగా తన ఆరోగ్యం పైనే ఈమె దృష్టి పెట్టారు. దీంతో తాను కమిట్ అయినటువంటి సినిమాలకు తీసుకున్నటువంటి అడ్వాన్సుల్ కూడా తిరిగి వెనక్కి ఇచ్చారు. ఇలా సమంత దాదాపు మూడు భారీ ప్రాజెక్టులకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.

Samantha: అడ్వాన్సులు వెనక్కి ఇచ్చిన సమంత…


ఈ విధంగా సమంత ఏకంగా మూడు సినిమాలకు కమిట్ కావడంతో ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చొప్పున సమంత 12 కోట్ల రూపాయలను నష్టపోయారని తెలుస్తోంది. అయితే తనకు డబ్బు కన్నా తన ఆరోగ్యమే ముఖ్యమని భావించిన సమంత ఇలా సినిమాలను వదులుకొని పూర్తిగా ఆరోగ్యం పైనే దృష్టి పెట్టారు. ఇక ఈమె చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది.

Samantha: మరోసారి ప్రేమలో పడిన సమంత… ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవాలన్నా నటి… పోస్ట్ వైరల్!

Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు నటి సమంత. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లతోపాటు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలానటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

నాగచైతన్యతో ప్రేమలో ఉన్నటువంటి ఈమె పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లయిన కొంతకాలానికి తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత ఆ బాధ నుంచి బయటపడి తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ఆ తర్వాత ఈమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి కారణంగా దాదాపు నాలుగైదు నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఇలా ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ కనుక చూస్తే ఈమె తిరిగి మరి ప్రేమలో పడ్డారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే గత కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తితో కలిసి ఈమె దిగిన ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Samantha: చావు నుంచి మనల్ని ఏది కాపాడలేదు…

చిలి దేశానికి చెందిన ప్రముఖ రచయిత రాసినటువంటి ఒక కొటేషన్ ను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు… ఇందులో భాగంగా ఈమె చావు నుండి మనల్ని ఏది కాపాడలేనప్పుడు ప్రేమతో జీవితాన్ని కాపాడుకోవడమే అంటూ ఓ కొటేషన్ షేర్ చేశారు. దీంతో సమంత తిరిగి ప్రేమలో పడిందా అందుకే ఇలాంటి కొటేషన్స్ షేర్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha: డబ్బు కోసం మరీ ఇంత దిగజారావ్ ఏంటి సమంత…. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లో అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.గత కొంతకాలంగా మయోసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత ప్రస్తుతం తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో సమంత వెంట పలు కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ తిరుగుతున్నారు.

ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి సమంత తాజాగా ఈమె చేసిన పని కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు అంటే అది జనాలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ఇబ్బందులను తీసుకువచ్చేదే ఉండకూడదు. కానీ తాజాగా సమంత పెప్సీ యాడ్ చేశారు.

Samantha ఆరోగ్యానికి హానికరం…

ఇలా ఈ ప్రమోషన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్స్ సమంత ఈ వీడియో పై స్పందిస్తూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు సంపాదించిన డబ్బు సరిపోలేదా డబ్బు కోసం తిరిగి ఇలా ఆరోగ్యానికి హానికరం చేసే వాటిని కూడా ప్రమోట్ చేయాలా అంటూ తీవ్రస్థాయిలో తనని ట్రోల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం సమంత మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Samantha : “నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ ?” సమంతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిట్టిబాబు…

Samantha: హీరోయిన్ సమంత సీనియర్ నిర్మాత చిట్టిబాబు మధ్యగత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కొంతకాలం క్రితం సమంత మయోసైటిసిస్ వ్యాధి వల్ల ఇబ్బందిపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వ్యాధి నుండి కొంచం కోలుకోగానే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే ఆ ప్రమోషన్స్ లో తన అనారోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

ఈ సినిమా సక్సెస్ చేయటానికి సమంత సింపతి ప్లే చేస్తూ డ్రామాలు ఆడుతోందని సీనియర్ నిర్మాత చిట్టిబాబు సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా సమంత హీరోయిన్ మెటీరియల్ కాదని కానీ శకుంతలగా ఆమెకు అవకాశం ఎలా వచ్చిందో తెలియటం లేదని చిట్టిబాబు వెల్లడించాడు. అయితే చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలపై సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

చిట్టిబాబు తనపై చేసిన ఆరోపణలకు బదులు చెబుతూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఈ క్రమంలో మనుషులు చెవులలో వెంట్రుకలు ఎలా పెంచుతారు ?అని గూగుల్ లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ చిట్టి బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజాగా సమంత ఇచ్చిన కౌంటర్ కి చిట్టిబాబు రీ కౌంటర్ ఇచ్చాడు.

Samantha: నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుంది…


ఈ క్రమంలో తాజాగా చిట్టి బాబు స్పందిస్తూ..” నా చెవులలో ఉన్న వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను చేసిన కామెంట్స్ లో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుందని ” అన్నారు. నేను మాట్లాడితే ఆమె తల ఎక్కడ పెట్టుకుంటుందని తెలిపారు. అయితే తన పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కనుక తాను కూడా ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడదలచుకోలేదు అంటూ ఈ సందర్భంగా నిర్మాత చిట్టిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha: అఖిల్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సమంత… మరిది పై ఇంత ప్రేమనా… మరి అఖిల్ రిప్లై ఏంటో?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టి నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే సమంత నాగచైతన్య విడిపోయినప్పటికీ సమంత మాత్రం అక్కినేని కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పరచుకుందని చెప్పాలి.

ఇలా నాగచైతన్యకు దూరంగా ఉన్నటువంటి సమంత అఖిల్ తో ఈమెకు మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఇలా ఆయన సినిమాలు విడుదలయ్యే సమయంలోను అలాగే తన పుట్టినరోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ అయిన రానా ఆశ్రిత మిహీకా వంటి వారితో కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా ముచ్చట్లు పెడుతూ ఉంటారు.

తాజాగా అఖిల్ తన 29వ పుట్టినరోజును జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే అఖిల్ అక్కినేని. ఎయ్… ఏజెంట్ 28వ తేదీన రాబోతోంది.. చూస్తుంటే ఫైర్ లా ఉంది లాట్సాఫ్ లవ్ అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Samantha:అఖిల్ రిప్లై ఇస్తారా..


ఇలా సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పలువురు నెటిజన్ సమంతకు మరిది అంటే అంత ప్రేమ నా అంటూ కామెంట్లు చేశారు. అయితే గత ఏడాది కూడా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా ఈయన మాత్రం రిప్లై ఇవ్వలేదు మరి ఈసారైనా సమంత పోస్టుకు రిప్లై ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Majili Movie: సమంత నాగచైతన్య మజిలీకి నాలుగేళ్లు పూర్తి… జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత!

Majili Movie: సమంత నాగచైతన్య జంటగా నటించిన సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మంచిగా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల సమంత నాగచైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు.

పెళ్లికి ముందు మూడు సినిమాలలో జంటగా నటించిన ఈ జంట పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో జంటగా సందడి చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా 2019 ఏప్రిల్ 5వ తేదీ విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో సమంత అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ లవ్ యు శివ నిర్వాణ శ్రావణి లాంటి అద్భుతమైన పాత్రలో చేసే అవకాశం ఇచ్చినందుకు… ఇక ప్రస్తుతం ఖుషిలో ‘ఆరాధ్య’తో అదరగొడుదాం’ అంటూ తనఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా మజిలీ సినిమా విశేషాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.


Majili Movie: ఆరాధ్యతో అదరగొడుదాం…

ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఆరాధ్య పాత్ర ద్వారా సమంత ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఆరాధ్య పాత్ర ద్వారా సమంత ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Samantha – Naga Chaitanya: నన్ను క్షమించండి.. సమంత తల్లి ముందు కన్నీళ్లు పెట్టుకున్న చైతు..

Samantha – Naga Chaitanya: సమంత, నాగచైతన్య వ్యవహారం ఒడవని ముచ్చటగా మారిపోయింది. ఎక్కడ చూసినా.. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగర వైరల్ అవుతుంటాయి. వాళ్లు విడాకులు తీసుకొని దాదాపు మూడు నెలలు పూర్తి అయింది. అధికారికంగా వారిద్దరు ప్రకటించుకున్నారు కనుక ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.

కానీ చట్ట ప్రకారం మాత్రం వాళ్లకు ఇంకా విడాకుల పత్రాలు మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా.. సమంత, నాగచైతన్యల విషయానికి వస్తే నాగచైతన్య సున్నితమైన మనస్తత్వం కలవాడు. ఎవరినీ నొప్పించడు. ఏం జరిగినా తనలో తానే కుమిలిపోతుంటాడు. విడాకుల ప్రకటన తర్వాతా అతడు దాదాపు మూడు వారాల పాటు.. ఇంట్లోనే ఉండి..ఎంతో కుమిలిపోయినట్లుగా తెలుస్తోంది.

ఆ మూడు వారాలు మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే ప్రస్తుతం నాగచైతన్య, సమంత మళ్లీ ఒకటవుతారనే వార్తలు వస్తున్నాయి. ఎలా అంటే దీనికి ఒక ఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల చైతూ..విడాకులు తీసకున్నందుకు సారీ ఆంటీ అంటూ.. సమంత తల్లికి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడట.

సమంత తల్లి చైతూను.. ఒక కొడుకులాగే ట్రీట్ చేసేదట. అందుకే అత్తకు ఫోన్ చేసి విడాకుల విషయం చెప్పి.. క్షమాపణలు కోరాడని తెలుస్తోంది. ఒక వేళ సమంత మళ్లీ వస్తే.. కలిసేందుకు నాగచైతన్య ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వార్తలు గుప్పుమంటున్నాయి.

ఆ విషయం అభిమానులకు పెద్ద షాక్..

అయితే ఇది నిజం కాకుండా ఉండటానికే ఎక్కువగా అవకాశం ఉంది.. ఎందుకంటే.. సమంతపై నాగచైతన్యకు ఇప్పటికే ప్రేమ అంతా చచ్చిపోయింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కూడా.. కాస్త స్కిన్ షో ఉన్న సినిమాలు చేయడం మొదలు పెట్టింది. దీంతో అతడికి ఆమెపై ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా పోయిందనేది తెలుస్తోంది. కనుక ఇలా చర్చించుకోవడం అనేది వృదా అన్నట్లుగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన చాలామంది అభిమానులకు షాక్ ఇచ్చింది.

హంతకులు, దుర్మార్గులు, నమ్మకద్రోహులు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత..!

ఏ మాయ చేసావే సినిమా ద్వారా మొట్ట మొదటి సారి తెరపై సందడి చేసిన చైతన్య సమంత ఆ తరువాత పలు సినిమాలలో నటించి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి 2017లో పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ జంటగా నిలిచిన వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.గత కొద్ది రోజుల నుంచి వీరి గురించి వస్తున్న వార్తలు నిజమేనని నేడు నాగచైతన్య విడాకుల విషయం గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటన అనంతరం సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సమంత తన స్టోరీలో.. నేను ఎంతో బాధ నిస్పృహలో ఉన్న సమయంలో నాకు ఒక విషయం అర్థం అయింది. చివరికి ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు దుర్మార్గులు, హంతకులు, నమ్మకద్రోహులు ఉంటారు. వెన్నుపోటు పొడుస్తూ ఎవరికీ తెలియకుండా ఉండటంలో వారికి వారే నిపుణులు. ఇలాంటి వారు చివరికి నాశనం అవుతారు. చరిత్ర కూడా ఇదే చెబుతుంది. ఈ విషయాన్ని నాకు మా అమ్మ చెప్పింది అంటూ తన స్టోరీస్ ని ముగించారు.

ఈ విధంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎంతో ఎమోషనల్ గా బాధపడుతూ పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విడాకుల తర్వాత తన తల్లి చెప్పిన విషయాలను సమంత పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదిఏమైనప్పటికీ సమంత నాగ చైతన్యల వివాహ బంధంలో విడిపోవడం అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.

సమంత వదిన.. చైతన్య అన్నయ్యకు విడాకులు ఇవ్వొద్దు.. – శ్రీ రెడ్డి..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే.. అది అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విషయం అని చెప్పవచ్చు. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం స్పందించకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు వీరిద్దరూ కలిసి ఉండాలని విడిపోకూడదని కోరుకున్నారు. తాజాగా సమంత చైతన్యల విడాకుల విషయంపై కాంట్రవర్సి బ్యూటీ శ్రీ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బ్యూటిఫుల్ కపుల్స్ సమంత నాగచైతన్య జంటను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఇలా విడాకులు తీసుకొని విడిపోకూడదని ఆమె కోరుకున్నారు.

తమిళనాడులో చాలా మంది ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ లో మాట్లాడగా సమంత పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని..సమంత ఏంటి అంత పెద్ద ఇంటికి కోడలు గా ఉండి ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఏంటనీ చాలామంది అనుకుంటున్నారని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తెలియజేశారు. పెళ్లి తర్వాత సమంత డ్రెస్సింగ్ విషయంలో చాలా మార్పులు జరిగాయని మనం ఎంత స్టార్ సెలబ్రిటీ అయినా మనం ఇండియాలోనే ఉన్నాము. ఇండియాలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి తన డ్రెస్సింగ్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు.

సంసారం అన్నాక ఎన్నో గొడవలు, పోట్లాటలు ఉంటాయి. అయితే వాటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో అన్యోన్యంగా ఉండవచ్చని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు. ఇండియాలో ఆడవాళ్లకు కొద్దిగా సహనం ఎక్కువ అంటారు అదే సహనంతో మీ సమస్యను పరిష్కరించుకొని నాగచైతన్య అన్నయ్య కానీ సమంత వదిన కానీ సర్దుకుపోతే మీ జీవితం ఎంతో బాగుంటుంది. మీరిద్దరూ కలిసి ఉండి ఎందరికో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సమంత నాగచైతన్య విడాకుల విషయం గురించి స్పందించారు.

కోర్టులో తేల్చుకుంటా..! సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..!

అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య ఏమి నడుస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. విడాకుల విషయమై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. వాటిపై వారిద్దరిలో ఒక్కరూ కూడా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో విచిత్రమైన, విభిన్నమైన పోస్టులు పెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోవడం లేదు.

రోజు రోజుకూ రూమర్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల నాగచైతన్య ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత విషయాలను అడగొద్దని కండీషన్ కూడా పెట్టారు. దీంతో అనుమానాలకు ఇంకా బలం చేకూరినట్లు అయింది. ఇటీవల అలాంటి రూమర్స్ ను నమ్మను అని.. తన తల్లిదండ్రులు ఇలాగే పెంచారని చెప్పిన నాగచైతన్య అంతలోనే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అభిమానుల్లోనే గందరగోళ పరిస్థితి ఉండగా.. అటు సినీ పరిశ్రమలో కూడా వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఇదిలా ఉండగా.. తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకునేందుకు సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నారంటూ తెలుస్తోంది.

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సమంత తన లీగల్ టీమ్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల దేవస్థానం వద్ద కూడా ఓ రిపోర్టర్ తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్న అడిగితే.. గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి బుద్ది ఉందా అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వార్తలు ఇక మీడియాలో రాకుండా ఏం చేయాలనే సలహాలు తన లీగల్ టీం సభ్యుల నుంచి తీసుకుంటున్నట్లు సమాచారం.