గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకు వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆఫీసులకు వెళ్లేవారు ఇంటినుంచి పని చేయగా, స్కూలుకు వెళ్లే చిన్నారులు ఆన్లైన్ క్లాసులతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారు మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పిల్లలు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావడం వల్ల వారిలో మరి కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు కరోనా బారిన పడకుండా వారిని ఎలా రక్షించుకోవాలి. వారిలో ఉన్న మానసిక ఆందోళనలు ఏవిధంగా తొలగించాలనే విషయం గురించి పలువురు నిపుణులు తెలియజేశారు. మరి పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా స్కూల్ కి వెళ్లి తోటి పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతూ చదువుకునే విద్యార్థులు ప్రస్తుతం ఇంటిలో ఆన్లైన్ క్లాసులకు పరిమితమయ్యారు. ఈ విధంగా నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి ఆందోళనలు అధిక శ్రమ వారిలో మరి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో ఎంతో చనువుగా, ప్రేమగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల వారిలో ఒత్తిడి తగ్గుతుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు కేవలం వారికి చదువు పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తలెత్తే సమస్యలను సైతం ఉపాధ్యాయులు అడిగి తెలుసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించేవారు.ఈ విధంగా తల్లిదండ్రులు కూడా వారు ప్రతి చిన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే పిల్లలలో ఎలాంటి ఆందోళనలు ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితుల నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే తల్లిదండ్రులు కొంత సమయం పాటు దగ్గరుండి ఆ విలువైన సమయాన్ని పిల్లలతో హాయిగా గడపటం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి చిన్న విషయంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి మానసిక సమస్యలకు,కరోనా వంటి మహమ్మారి బారిన పడకుండా రక్షించగలమని నిపుణులు తెలియజేస్తున్నారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.