Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సినిమాలలో కన్నా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూనమ్ కౌర్ ఏదైనా ఒక విషయం పై ట్వీట్ చేసింది అంటే అది ఎవరిని ఉద్దేశించి చేసిందనే విషయం తెలియక తల పీక్కుంటారు. ఈ క్రమంలోనే పూనమ్ తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంతో హుందాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై వర్మ స్పందిస్తూ ట్వీట్ చేయడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వర్మ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన స్పీచ్ లో ఇదే బెస్ట్ అంటూ చేసిన ట్వీట్ పై పూనమ్ స్పందించారు. ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేస్తూ ఒక దర్శకుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తూ మూలగ… సైలెంట్ గా ఉండిపోతారు. మరొక దర్శకుడు ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.
అయితే ఈ ఇద్దరు దర్శకులు డబ్బులు ఇచ్చి బాడుగకు ఏజెంట్లను తెచ్చుకున్న వారే.
వీరిద్దరూ మహిళలను ఆయుధాలుగా చేసుకుని వాడుకుంటారని పూనమ్ ట్వీట్ చేశారు.ఇక ఈమె చెప్పిన ఆ ఇద్దరు దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ అని తెలిసిపోతుంది. మరోక దర్శకుడు ఎవరంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు. మొత్తానికి పూనమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
One director abuses his personal life completely and smiles from the corner and keeps quite while the public abuses for personal space
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 24, 2022
Another director would do anything to demean him politically and smiles on Twitter
Both are hired and paid agents using women as weapon . https://t.co/h47mhGFBb6































