ప్రముఖ జర్నలిస్ట్, సినీ పరిశ్రమ కు చెందిన టీఎన్ఆర్ (TNR) గత మే నెలలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు వదిలారు. అతను యాంకర్ గా చేస్తూ ఇంటర్వ్యూలను నిర్వహించేవారు. అతడు చేసే ప్రతీ ఇంటర్వ్యూలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఎంతో మంది అభిమానులకు కూడా సంపాదించారు. మొదటి నుంచి ఆయనకు దర్శకుడు కావాలనే కల ఉండేది. కానీ అది నెరవేరలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి కుమారుడు తనతండ్రి గురించి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

చిరంజీవి హీరోగా నటించి ముగ్గురు మొనగాళ్లు సినిమా అంటే తన నాన్నకు ఎంతో ఇష్టమని.. అందరం కలిసి ఆ సినిమాను చూసే వాళ్లం అని చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ‘మిస్ యూ నాన్న’ అంటూ అతడు కంటతడిపెట్టాడు. టీఎన్ఆర్ యాంకర్ గాను సినిమాలోని తన నటనతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించాడు.

అతడు సినీ నటులతో చేసిన ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వచ్చేవి. నటుడిగా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆశించేవాడు కాదు. ఇలా అకాలమరణం చెందడంతో ఎంతో మంది అభిమానులకు దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరితో కలిసిమెలిసి పోయే మనస్తత్వం మరియు ముక్కుసూటితనం అతడిని చాలామందికి దగ్గరకు చేర్చింది.
సినీ పరిశ్రమలో ఒకసహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దగ్గుపాటి రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా, ఫలక్ నుమా దాస్, జార్జ్ రెడ్డి, సవారీ, HIT, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, సుబ్రహ్మణ్యపురం, జాతి రత్నాలు వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన నటనను అందించిన ప్రముఖ తెలుగు నటుడు టీఎన్ఆర్.































