ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ఎంతో అవసరం. మన రోజు వారి అవసరాలు తీరాలన్న, ఏదైనా చిన్న పని నుంచి పెద్ద పని నెరవేరాలని డబ్బు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు లేనిదే ఎటువంటి చిన్న పని కూడా సక్రమంగా నెరవేరదు అనే విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా డబ్బుతో సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో మరేదీ లేదు. అదృష్టం కలిసి వస్తే కొంతమందికి డబ్బులు ఎటువంటి పనులు చేయకున్నా వారికి లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. మరి కొంతమంది రాత్రి పగలు కష్టపడుతున్న చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అలాంటి వారు చేతిలో డబ్బు నిలవాలంటే ఈ క్రింది నియమాలను పాటిస్తే వారి చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి…

సాధారణంగా లక్ష్మీ దేవి సంపదకు మూలమని చెబుతుంటారు. అలాంటి సంపద మనకు కలగాలంటే లక్ష్మీ దేవిని పూజించాలని పండితులు తెలియజేస్తున్నారు.అయితే లక్ష్మీదేవిని బియ్యంతో పూజించిన తర్వాత పూజించిన బియ్యాన్ని మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే సంపాదించిన డబ్బు కూడా మన దగ్గర నిల్వ ఉంటుంది.
లక్ష్మీదేవి ఫోటోను విష్ణు పాదాల చెంత పెట్టడం వల్ల మన ఇంట్లో డబ్బు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు ఆకులు కోసి ఆకులను శుభ్రంగా కడిగి ఆకుపై T అనే అక్షరాన్ని రాసి మన దగ్గర ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడవు. గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.అటువంటి గవ్వలకు పూజ చేసి ఒక తెల్లటి వస్త్రంలో కట్టి మన ఇంటిలో డబ్బు నిల్వ ఉంటే చోట పెట్టడం ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీ ప్రవాహం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
అదేవిధంగా తెల్లని కోడిగుడ్డు ఆకారంలో ఉన్న రాయిని నిత్యం మన వెంట పెట్టుకోవడం ద్వారా మనలో ఏర్పడే ప్రతికూల ఆలోచనలను తొలగించి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కొన్ని నియమాలను పాటించటం వల్ల మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి మన చేతిలో కొంత వరకు డబ్బు నిల్వ ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.































