Connect with us

Featured

ఒక్క సినిమాకే టాలీవుడ్ నుండి చెక్కేసిన ముద్దుగుమ్మలు !!

Published

on

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ కాలమే ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ హీరోలకు కెరీర్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఎందుకంటే వాళ్లకి హీరోలుగా ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా చేసుకుంటూ సక్సెస్ సాధించుకుంటూ వీలైనంత వరకు అలాగే సినిమాలు చేసుకుంటూ దశాబ్దాలపాటు అగ్రహీరోలుగా కొనసాగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా లేదు ఎంత అగ్ర హీరోయిన్ అయినప్పటికీ వల్ల కెరియర్ అనేది దశాబ్దకాలం పాటు కొనసాగుతుంది తప్ప అంతకు మించి ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉండటం అంటే చాలా కష్టం అనే చెప్పాలి.

అయితే కొందరు మాత్రం ఒకటి.. అర సినిమాలతో సరిపెట్టుకునే వాళ్లు కూడా ఉన్నారు. అందంలోనూ, అభినయంలోనూ చూడడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ ఒకటి అర సినిమాలతో మాత్రమే సరిపెట్టుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత అవకాశాలు లేక మళ్లీ ఇంకో సినిమాలో కనబడకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం…


అదితి ఆర్య
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఇజం సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తనకు హీరోయిన్ గా మంచి పేరు వచ్చినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. దాంతో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని చెప్పాలి. మరి ఒక్క సినిమాతోనే ఈమె కెరీర్ ముగిసిపోయింది అంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…

ముస్కాన్ సేతి
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ముస్కాన్ సేతి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. దాంతో ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు ఆతర్వాత ‘రాగల 24 గంటల్లో’ అనే త్రిల్లర్ మూవీ లో నటించినప్పటికీ అది కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. దాంతో ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి…

నిఖిషా పటేల్
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘కొమరం పులి’ సినిమా లో హీరోయిన్ గా నటించింది. నిఖిషా పటేల్ ఈ సినిమాలో తన అందంతో అభినయంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నప్పటికీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ అమ్మడుకు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఓం’ అనే సినిమాలో నటించినప్పటికీ అది కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఐరన్ లెగ్ ముద్ర వేసి అవకాశాలను ఇవ్వకుండా వదిలేశారు…

షహీన్
హీరోయిన్లుగా కెరీర్ ని ప్రారంభించిన వాళ్లు అందాన్ని అభినయాన్ని చూపినప్పటికీ సినిమాలు సక్సెస్ కాకపోతే వాళ్ళకి పెద్దగా అవకాశాలు రావు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు ఇచ్చి రామ్ ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ‘చిరునవ్వుతో’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన షహిన్ కి కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు అని చెప్పాలి. అయితే చిరునవ్వుతో సినిమా తమిళ్ రీమేక్ లో కూడా తనే హీరోయిన్ గా నటించింది కానీ తెలుగులో అంత పెద్ద విజయం సాధించిన కూడా చిరునవ్వుతో సినిమా తర్వాత ఆమెకి 1,2 సినిమాలకు మించి అవకాశాలు రాకపోవడం అనేది కొంచెం బాధకు గురి చేసే అంశం అనే చెప్పాలి…

మాళవిక శర్మ
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘నేల టికెట్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మాళవిక శర్మ మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంది. అయినప్పటికీ నేల టికెట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఆవిడకు అవకాశాలు రాలేదు. అయినా కూడా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘రెడ్’ సినిమాలో హీరోయిన్ గా ఒక అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఈ అమ్మడుకు అవకాశం ఇచ్చే దర్శకుడు కరువయ్యాడు…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!