టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ ‘స్నేహ’. పెళ్లి అయిన తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు. కొన్నాళ్ల నుంచి ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తోంది. రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా వినయ విధేయ రామలో కూడా వదిన పాత్రలో ఒదిగిపోయారు. స్నేహ తొలివలపు మూవీతో గోపీచంద్ సరసన నటించారు.

తర్వాత వెంకీ, రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు,రాజన్న, ఉలవచారు బిర్యానీ మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చకున్నారు. స్నేహ పుట్టింది ముంబయిలో. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు. ఇంటర్ పూర్తయ్యాక సినీ రంగంపై గల ఆసక్తితో మళయాళ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చి, అనతికాలంలోనే పలు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది. అయితే ఇటీవల అలీతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అందులో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. 2012 మే 11 న తమిళ నటుడు ప్రసన్నతో వివాహం అయినట్లు తెలిపారు. తనది ప్రేమ వివాహం అని చెప్పుకొచ్చింది. మొదట్లో స్నేహపై ప్రసన్నకు కోపం ఉండేదంట.. ఎందుకంటే ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో తన పక్కన హీరోయిన్ గా నటించనని చెప్పడంతో తనపై కోపం పెంచుకున్నట్లు తెలిపారు.

వీరి పెళ్లికి మొదట ఇరు కుటుంబపెద్దలు అంగీకరించలేదట. స్నేహ తల్లిదండ్రులు ఒప్పుకున్నా.. ప్రసన్న తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. గొడవలు కూడా జరిగినట్లు ఆమె చెప్పారు. తర్వాత ఎట్టకేలకు ఒక్కటయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు.































