ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు నటి శ్రీవాణి.ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా టీవీ సెలబ్రిటీలు శ్రీ వాణి ,గీతా సౌజన్య, ప్రశాంతి, నవీన వీళ్లంతా గ్రూప్ ఇంటర్వ్యూ నిర్వహించి తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో నటి శ్రీవాణి తన తొలి ముద్దు గురించి ఓపెన్ గా మాట్లాడింది.

నటి శ్రీవాణి విక్రమ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే తనకి పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు తన భర్త విక్రమ్ హైదరాబాద్లోని ప్రేమికులకు ఎంతో పేరుగాంచిన స్థలం దుర్గం చెరువుకి తీసుకెళ్లి ముద్దు పెట్టాడని అసలు రహస్యాన్ని బయటపెట్టారు. పెళ్లికి ముందే మా ఇద్దరి మధ్య ముద్దులు అయిపోయాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తనకు మొదటగా తన భర్త కిస్ చేశారని శ్రీవాణి తెలిపారు.
ఈ క్రమంలోనే మా ఆయన వేరేవాళ్లను ముద్దు పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిస్తే మాత్రం మా ఆయన బతకడంటూ తన భర్త విక్రమ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం 16 ఏళ్ల వయసులో ముద్దులతో ఆపకుండా ఈ నటి ప్రేమ కథలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. పదహారేళ్లకే ముద్దులతో ప్రారంభమైన వీరి ప్రేమ 17 ఏళ్లకే తాను ప్రేమించిన విక్రమ్ తో వెళ్ళిపోయింది.అయితే తనకు అప్పటికింకా పదిహేడేళ్ళ కనుక ఒక సంవత్సరం వరకు వేచి ఉండి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.
ఈమె తన భర్త విక్రమ్ తో కలిసి వెళ్లిపోయిన సమయానికి ఈటీవీలో ఘర్షణ అనే సీరియల్ లో నటిస్తున్నారు. శ్రీవాణి వెళ్లిపోవడంతో ఆ సీరియల్ అక్కడికే ఆగిపోయింది. ఈటీవీ ఇండస్ట్రీలోనే కేవలం 60 ఎపిసోడ్ లకే ముగిసిన సీరియల్ ఏదైనా ఉందా అంటే అది ఘర్షణ సీరియల్ అని చెప్పవచ్చు.ఆ తర్వాత ఈ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న చంద్రముఖి సీరియల్ కోసం మరోసారి శ్రీవాణికి అవకాశం ఇచ్చారు. ఈ సీరియల్ లో దాదాపు ఏడు సంవత్సరాల పాటు శ్రీవాణి నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
































