తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించిన మెగా హీరో వైష్టవ్ తేజ్. ఇలా మొదటి సినిమాతో తమ కెరీర్ కు బంగారు బాటను వేసుకున్నాడు హీరోలు సినీ పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా తన మొదటి సినిమా ‘ఉప్పెన’తో ఓ రేంజిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా ఆసక్తికర చిత్రం ‘కొండ పొలం’.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా సంచలన దర్శకుడు క్రిష్ ఆధ్వర్యంలో తెరకెక్కుతోంది. కొండపొలం అనేది ఒక నవల. ఈ నవల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో రకుల్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్లుక్ పోస్టర్, వీడియో షేర్ చేశారు మేకర్స్.
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ.. కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది.‘కొండ పొలం’ సినిమా ట్రైలర్ను వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 27న సాయంత్రం విడుదల చేస్తామంటూ దర్శకుడు క్రిష్ పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు క్రిష్. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచర్స్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు.
అయితే ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ఈ సినిమాను కేవలం రెండునెలల్లోనే పూర్తి చేశారట. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓబులమ్మ అనే సాంగ్ విడుదల చేసిన తెలిసిందే.































