Shilpa shetty – Raj Kundra: ఇటీవల కాలంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ విడిపోయారు. అమీర్ ఖాన్- కిరణ్ రావ్, సమంత-నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య, సుస్మీతా సెన్- రోహ్మన్ షాల్ విడిపోయారు. సెలబ్రెటీ కపుల్స్ మధ్య విడాకులు కామన్ గా మారాయి. భేదాభిప్రాయాలతో విడిపోతున్నారు. సౌత్ లో సమంత-నాగ చైతన్య విడాకులు చాలా చర్చకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు విడిపోవడం వారి ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు. మరో స్టార్ కపుల్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్, ఐశ్వర్య రజినీ కాంత్ విడిపోవడం కూడా సంచలనం గా మారింది.

ఇదిలా ఉంటే మరో స్టార్ కపుల్ కూడా త్వరలో డైవర్స్ తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా కూడా విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది రాజ్ కుంద్రా బ్లూ ఫిలిం కేసులో నిందితుడిగా దొరికాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో రాజ్ కుంద్రా బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈకేసు తర్వాత నుంచి బాలీవుడ్ లో శిల్పా శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి.

విడాకుల కోసమే ఆస్తి పంపకాలు…
తాజాగా రాజ్ కుంద్రాపై ఉన్న ఆస్తులను శిల్పా శెట్టిపై బదలాయించు చేస్తున్నట్లు సమాచారం. డైవర్స్ తీసుకునేందుకు సిద్ధ పడటంతోనే ఆస్తులను పంచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 39 కోట్ల విలువున్న అపార్ట్ మెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ ను శిల్పా శెట్టి పేరు మీదికి మార్చారు. కినారా బీచ్ వ్యూలో రాజ్ కుంద్రా పేరుమీద ఉన్న అపార్ట్ మెంట్ తో పాటు ఫాం హౌజ్ ను కూడా శిల్పా శెట్టిపైకి బదలాయించాారని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి విడాకులపై క్లారిటీ రానుందని బాలీవుడ్ లో బోగట్టా. తెలుగులో శిల్పా శెట్టి బాలక్రిష్ణ, వెంకటేష్ సరసన నటించింది.































