Connect with us

Featured

Vijay Devarakonda: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ… ఎన్ని లక్షలకు అమ్మారో తెలుసా?

Published

on

Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నటుడు విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అవార్డును వేలం వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటనకు గాను ఏకంగా ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును ఈయన 2018 వ సంవత్సరంలో అమ్మేశారట. తనకు అవార్డులంటే పెద్దగా ఇష్టం ఉండదని విజయ్ దేవరకొండ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇలా తనకొచ్చిన కొన్ని అవార్డులను అమ్మగా మరికొన్ని ఆఫీసులో ఉన్నాయని మరికొన్ని ఇంట్లో ఉన్నాయని తెలిపారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చినటువంటి ఈ అవార్డును తాను వేలం పాటలో పెట్టానని ఒక ఐదు లక్షలకు అమ్ముడు పోతే పర్లేదు అనుకున్నాను కానీ ఈ అవార్డును ఏకంగా 25 లక్షలకు కొనుగోలు చేశారని ఈయన తెలిపారు.

Advertisement

25 లక్షలు..
ఈ అవార్డు వేలం వేసిన సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందినటువంటి శ్యామలాదేవి అనే మహిళ 25 లక్షలకు ఈ అవార్డు కొనుగోలు చేశారు. ఈ స్థాయిలో ఈ అవార్డు వేలంపాటలో పోవడంతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ఆమెకు అవార్డును అందజేశామని తెలిపారు. అయితే ఈ అవార్డు వేలం పాటలో వచ్చిన 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించానని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Advertisement

Featured

Ntr: స్థల వివాదంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్… తనకు సంబంధమే లేదంటూ?

Published

on

Ntr: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఒక స్థలం విషయంలో ఈయన కోర్టు మెట్లు ఎక్కారంటూ పెద్ద ఎత్తున వార్తలు సంచలనంగా మారాయి. ఎన్టీఆర్ గీత అనే మహిళ వద్ద కోట్లలో విలువ చేసే స్థలం కొన్నారని అయితే ఆ స్థలం పై ఆమె బ్యాంకు లోన్ తీసుకోనీ వాటిని కట్టకుండా ఎగ్గొట్టారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా స్థల వివాదం కారణంగా ఎన్టీఆర్ భారీ నష్టాలను ఎదుర్కోబోతున్నారు అందుకే కోర్టును ఆశ్రయించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై తాజాగా ఎన్టీఆర్ టీం స్పందించారు.ఎన్టీఆర్‌కు సంబంధించి ఈరోజు ప్రచురితమైన వార్తలకు ప్రతిస్పందనగా ఈ ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏ స్థలం గురించి అయితే చర్చ జరుగుతున్నదో అదే స్థలాన్ని 2013లో ఎన్టీఆర్‌ విక్రయించారని మేము స్పష్టం చేస్తున్నామని ఇకపై ఈ స్థల వివాదానికి సంబంధించినటువంటి వార్తలలో ఎన్టీఆర్ పేరును ఉపయోగించడానికి వీలులేదు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఎన్టీఆర్ పేరు వాడటానికి వీలు లేదు..
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన దేవర సినిమాతో పాటు బాలీవుడ్ వార్ 2 సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నటువంటి దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement
Continue Reading

Featured

Anasuya: భర్తతో కలిసి అడవులలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె దాక్షాయని అని నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్త పిల్లలతో కలిసి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నటువంటి ఈమె అడవుల బాట పడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

బర్త్ డే సెలబ్రేషన్స్..
ఇక అనసూయ తన పుట్టినరోజు వేడుకలను కూడా తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. సరదాగా కేక్ కట్ చేస్తూ తన ఫ్యామిలీతో ఈమె చిల్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement

ఇక అనసూయ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు అనసూయకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Ntr: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా.. నిజమైతే బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు పలు అప్డేట్స్ విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో దేవర సినిమా విడుదల అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు పెట్టబోయే టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

Advertisement

డ్రాగన్..
ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుందనే విషయం తెలియదు. ఎలాంటి బ్యాక్ డ్రాప్ అయినా కూడా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఇదివరకు ప్రశాంత్ తన సినిమాల ద్వారా చూపించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందేనని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!