WTC Final: ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు అంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తొలిరోజు నుంచి వరుణుడు ఆటకు అడ్డు తగులుతున్నాడు. నిన్న జరగాల్సిన మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఇక రెండో రోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు జరగాల్సిన సెకండ్ డే ఆట కూడా జరిగేలా కనిపించడం లేదు. భారత కాలమాన ప్రకారం రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

అయితే నిన్న ఉదయం నుంచి సౌథాంప్టన్లో భారీగా వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట రద్దైంది. అయితే డబ్ల్యూటీసీ మ్యాచ్ కోసం ఐసీసీ ఒక్క రిజర్వ్ డే కూడా ఉంచింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండో రాజు ఆట జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ రెండో రోజు ఆట కూడా రద్దయితే ఐసీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.






























