Connect with us

Uncategorized

వారాల పాటు తిండి తిప్పలు లేక కొడుకు చేత చావు దెబ్బలు తిన్న కోట్లాదిమంది అబిమాన తెలుగు హీరో..

Published

on

సినిమా పుట్టినప్పుటి నుంచి నటించడం ప్రారంభించారు. 1909లో జన్మించి, 1995 వరకు నటిస్తూనే ఉన్నారు. అతని జీవితం సినిమా వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒక చక్కని పాఠం. హిందీ సినిమా తొలి లెజండర్… 50 మంది హేమా హేమీలైన హీరోయిన్లతో హీరోగా నటించారు. మూకీల కాలంలో మొదలైన అతని నటన 1995 వరకు సాగింది. రాజ్‌కపూర్ లాంటి వారికి దర్శకత్వం వహించారు. అతని జీవితం వారసులకు ఆస్తిని ఎలా ఇవ్వాలో సినిమా లోకానికి ఒక మంచి పాఠం చెప్పింది. ఎవరా నటుడు? ఏమా కథ తెలుసుకునే ముందు…. డబ్బు సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు. సంపాదించిన డబ్బును జాగ్రత్త చేయాలని, సద్వినియోగం చేయాలి. చివరకు తన వారసులకు అప్పగించడం కూడా ఒక కళే ..మనం మన లెజెండ్ దగ్గరకు వద్దాం. ఎందుకంటే అతను కూడా తన ఆస్తిని వారసులకు ఎలా అప్పగించాలో తెలియక పోవడం వల్ల అంతిమ దశలో కలలో కూడా ఊహించని నిరాదరణకు గురయ్యారు. .

దాదాసాహెబ్ పాల్కె అవార్డు పొందిన తొలి తెలుగు వారు ఎవరు? అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెబుతారు. అక్కినేనికి 1991లో దాదాసాహెబ్ పాల్కె అవార్డు లభిస్తే, దశాబ్దం ముందు 1980లోనే ఓ తెలుగు నటునికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. తెలుగు వాడే అయినా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. 11 మూకీ సినిమాలు, 170 వరకు హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ సినిమాల్లో నటించిన జైరాజ్ ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించక పోవడం విచిత్రం. పి జయరాజ్ పేరు వినగానే హిందీ సినిమాల గురించి కనీస పరిచయం ఉన్న పాత తరం వారు ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటుడు అంటారు. పి జయరాజ్ అసలు పేరు జైరుల నాయుడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పుట్టిన పైడిపాతి జైరుల నాయుడు హిందీతో పాటు గుజరాతి, మరాఠీ భాషల సినిమాల్లోనూ నటించిన జయరాజ్‌ను తెలుగు సినిమా ప్రపంచం పట్టించుకోలేదు. ఆయనా తెలుగు సినిమాను పట్టించుకోలేదు. జైరాజ్ తన ఆత్మకథలో, తనపై నిర్మించిన డ్యాకుమెంటరీలో తాను కరీంనగర్‌లో జన్మించానని చెప్పేంత వరకు జైరాజ్ మూలాల గురించి సినిమా వారికి పెద్దగా తెలియదు. సరోజినీనాయుడుకు దగ్గరి బంధువు అయిన జైరాజ్ పుట్టింది కరీంనగర్‌లో.. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్నారు.

Advertisement

వయసులో ఉన్నప్పుడు జైరాజ్‌కు ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలని ఆసక్తిగా ఉండేది. తల్లి తన అన్నకే ప్రాధాన్యత ఇస్తుందనే కోపంతో 1929లో ఇంట్లో నుంచి బొంబాయికి పారిపోయాడు. ఓడరేవులో పనికి కుదిరాడు. అక్కడ సినిమా పోస్టర్లు వేసేవారు. ఆ సమయంలోనే అనేక మూకీ సినిమాల్లో నటించారు. రైఫిల్‌గర్ల్, బాబీ, హమారా బాత్ వంటి మూకీ సినిమాల్లో నటించారు. తరువాత స్వామి, తమన్న, హతిమ్‌తాయి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించారు. తొలి తరం సౌందర్య రాశులు మీనా కుమారి, మధుబాల, సురయలతో నటించారు. దిలీప్‌కుమార్ సినిమాకు దర్శకత్వం వహించారు. జైరాజ్ నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఖూన్‌బరీ మాంగ్. రేఖ, రిషికపూర్, కమల్ హసన్‌ల, డింపుల్ కపాడియాలతో కలిసి నటించారు. చిత్రంగా ఇదే పేరుతో జైరాజ్ ప్రారంభంలో ఒక సినిమా రూపొందించారు. అందులో భరత్‌భూషణ్, నర్గీస్‌తో పాటు జైరాజ్ నటించారు. చారిత్రక, పౌరాణిక సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. టిప్పుసుల్తాన్, హైదర్ అలీ బేగ్, రాణాప్రతాప్‌గా నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీ సినిమా రంగంలో అత్యంత గౌరవం పొందిన నటుడాయన. ఆయన జన్మదినం రోజున ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులంతా జైరాజ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు. ఈ సంప్రదాయం చాలా కాలం వరకు సాగింది. క్రమంగా జైరాజ్ సినిమా ప్రపంచాన్ని వదిలి ఇంటికి పరిమితం అవుతూ వచ్చిన కాలం వరకు ఇది సాగింది.

కొత్త తరం వచ్చింది… కొత్త పోకడలు, జైరాజ్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. .నా జీవితం చివరి దశలోఇంట్లో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ కోర్టులో వాపోవడం కంటతడిపెట్టించింది. హిందీ సినిమా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన జైరాజ్ 91 ఏళ్ల వయసులో ప్రశాంతమైన జీవితం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా ఎంతో సంపాదించాడు. ముంబైలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి. తన కుమారుడు దిలీప్‌రాజ్ వ్యాపారం ప్రారంభిస్తున్నానని చెప్పగానే ఆస్తులను అమ్మి ఇచ్చాడు. కుమారునిపై అజమాయిషీ చేసే వయసు కాదు అతనిది. ఏదో కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నాను , డబ్బు కావాలి అని కుమారుడు అడిగితే తండ్రి ఇవ్వలేదు. హాకీస్ట్రిక్ తీసుకొని కుమారుడు తండ్రిని కొట్టాడు. ఇంట్లోకి సందర్శకులు రావద్దని, ఫోన్ చేయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో స్నేహితులు, పెద్దలు వచ్చి పంచాయితీ చేశారు. దిలీప్‌రాజ్‌ను ఇంటి నుంచి పంపించి వేశారు. కుమారుడి ఖర్చుల కోసం తండ్రి ప్రతి నెల డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. కొంత కాలం గడిచాక జైరాజ్ భార్య మరణించిన తరువాత దిలీప్‌రాజ్, ఆయన భార్య వచ్చి నార్త్‌వెస్ట్ ముంబైలోని ఫాలీ హిల్స్‌లోని జైరాజ్‌కు చెందిన ఫ్లాట్‌ను ఆక్రమించేసుకున్నారు. చివరకు జైరాజ్‌ను ఆయన ఇంట్లోనే బందీగా మార్చేశారు. ఓ రోజు జైరాజ్ ఫోన్ చేసి తన కుతూరికి కన్నీరు పెడుతూ తనను హింసిస్తున్నారని ఎలాగైనా వచ్చి రక్షించమని కోరాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తన తండ్రి దయనీయంగా ఏడవడాన్ని కూతురు తట్టుకోలేక పోయింది. కలకత్తాలో ఉన్న కూతురు వెంటనే ముంబై వచ్చింది.

కనీసం సరైన దుస్తులు కూడా లేవు, గదిలో వాసన వస్తోంది, స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో అనిపిస్తోంది. వెంటనే డాక్టర్‌ను పిలవడంతో ఆయన చికిత్స ప్రారంభించారు. చూసి పోదామని వచ్చాను కానీ పరిస్థితి చూశాక ఇలా వదలివెళ్లలేక పోయాను అంటూ జైరాజ్ కుమార్తె గీత జరిగిన విషయం కోర్టుకు చెప్పింది. నా చివరి రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ న్యాయమూర్తికి చెప్పారు. ఆ ఫ్లాట్‌పై తండ్రికే అధికారం ఉందని, కుమారుడు రోజుకు ఒకసారి చూసి వెళ్లడం తప్ప అక్కడ ఉండేందుకు వీలు లేదని కోర్టు ఆదేశించింది. ఆ తరువాత జైరాజ్ ఎక్కువ రోజులు బతకలేదు. 2000 సంవత్సరం ఆగస్టు 11న జైరాజ్ కన్ను మూశారు. ఆస్తులు పెంచుకోవడమే కాదు పిల్లలకు తల్లిదండ్రులపై అభిమానం అనే డిపాజిట్ కూడా పెంచుకోవాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Uncategorized

అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా! : కొత్తపల్లి గీత

Published

on

కొత్తపల్లి గీత.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రభుత్వాధికారిగా.. రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమే.! తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-01 అధికారిగా సేవలందించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీచేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన మరుసటి రోజు నుంచే అరుకును అభివృద్ధి బాటలో నడిపించి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంటే ఏంటో చూపించారు.

నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని విబేధాలతో బయటికొచ్చి.. ఎంపీగానే కొనసాగుతూ 2018లో స్వయంగా జనజాగృతి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సామాజిక వర్గాన్నే కాదు.. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన వారిని అభివృద్ధి బాటలో నడిపించాలనే తపనతో ముందుకొచ్చారు కానీ.. పార్టీ అంటే డబ్బులతో ముడిపడి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకుని 2019లో బీజేపీలో విలీనం చేయడం జరిగింది. నాటి నుంచి బీజేపీ నేతగా కొనసాగుతూ నియోజకవర్గానికి తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఆమె కృషికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అంతేకాదు.. అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న గీతను సీటు దక్కేలా చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ కొత్తపల్లి దూసుకెళ్తున్నారు.

గిరిజనాభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని గీత గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. అరకులో ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా మార్చడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఎందుకంటే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని.. గిరిజనులు అంటే మోదీకి ప్రేమ అని.. దీంతో కచ్చితంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డను బాగుచేస్తామని.. అది కూటమి గెలిస్తే.. కేంద్రంలో మోదీ వస్తేనే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అరకు ఎంపీగా గెలిస్తే.. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను బాగు చేయడం ఈ నాలుగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు గీత. యువత అంటే ఎంతసేపూ జెండాలు పట్టుకోవడానికి తప్ప.. వారికి ఉద్యోగాలు, ఇండస్ట్రీలు తీసుకొచ్చిన పాపాన వైసీపీ పోలేదన్నారు.

Advertisement

ఇప్పటికే తాను ఎంపీగా పనిచేసినంతకాలం అభివృద్ధికై సాయశక్తులా కృషి చేశానని.. మరోసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపిస్తామంటున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్థులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని.. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు పనిచేయడానికే తాను ముందుంటానని చెబుతున్నారు. దీంతోపాటు ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా చేస్తామని మాటిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ చేయకుండా ఉండటానికి తనవంతుగా యుద్ధం చేస్తానని.. చట్ట ప్రకారమే చేయడానికి మాత్రమే వీలుకల్పిస్తామని కొత్తపల్లి క్లియర్ కట్‌గా చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న మనిషి. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి.. ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగానే కాకుండా.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. గిరిజనులను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా మోదీ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయో అరకులో కూడా అలాంటివే ఏర్పాటు చేసి.. విదేశీ విద్యకు గిరిజనులను పంపి.. ఇవేకాదు సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని గీత చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా.. అరకు ప్రాంతానికి వ్యాపారం పేరిట వచ్చి కొందరు అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడం.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి తన వంతు ప్రయాత్నాలు చేస్తానని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను దీన్ని రూపుమాపడానికి 2014లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని.. ఈసారి 2024 ఎంపీగా గెలిస్తే ఎన్నికల ఫలితాలొచ్చిన జూన్-05 నుంచే కచ్చితంగా దీన్ని అణిచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు గీత వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Crime News : ఆరు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి… ఒంటిపై పంటిగాట్లు గుర్తించి !

Published

on

Crime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. కౌమార దశలో ఉండే పదమూడు సంవత్సరాల మైనర్ బాలిక శారీరంగా వచ్చే మార్పులు ఆమెను ఓ దారుణానికి వాడుకున్నాయి. తాను ఏం చేస్తున్నానో తెలియని చిన్న వయస్సు ఒకవేళ తెలిసినా.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చేసుకోని వయస్సులో ఉంది ఆ చిన్నారి. అయితే ఓ కామ పిశాచికి ఇవే అనుకూలంగా మారాయి.

minor girl sexually attacked from past six months in hyderabad
minor girl sexually attacked from past six months in hyderabad

ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి. రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.

minor girl sexually attacked from past six months in hyderabad
minor girl sexually attacked from past six months in hyderabad

జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్‌ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు.

ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటే ?

ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Continue Reading

Featured

Viral News : ఒక్క నిమిషంలో ఆ ఘనత సాధించి గిన్నీస్ బుక్ లో చోటు… ఆ కుర్రాడు ఎవరంటే ?

Published

on

Viral News : గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రికార్డ్‌ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. కానీ మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్‌ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. 24 సంవత్సరాల తౌనోజామ్‌ నిరంజోయ్‌ సింగ్‌ అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్‌ అప్‌లు తీసి ఔరా అనిపించాడు.

manipur young boy create world record and got place in guinness book
manipur young boy create world record and got place in guinness book

గతంలో 2009 మే 25న యునైటెడ్ కింగ్డమ్‌ కి చెందిన గ్రాహం మాలీ నిమిషంలో 105 పుష్‌ అప్‌ చేసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ నెలకోల్పితే…అతడి రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్‌ సింగ్‌. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్‌. గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్‌ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60 సెకన్లలో 109 పుష్‌ అప్స్‌ చేసి తన పేరును గిన్నీస్‌ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్‌ సింగ్.

manipur young boy create world record and got place in guinness book
manipur young boy create world record and got place in guinness book

నిరంజోయ్‌ సింగ్‌కు పుష్‌ అప్స్‌లో గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. మణిపాల్‌ లోని ఇంపాల్‌ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

మణిపూర్ ఆణిముత్యం అంటూ ప్రశంసిస్తున్న ప్రముఖులు…

మణిపూర్‌కి చెందిన ఈ యువకుడు సాధించిన ఈ ఘనతను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్‌ చేశారు కిరణ్‌ రిజిజు. అలానే 24 సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్‌ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్‌ మంత్రులు, జిల్లా కలెక్టర్‌ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు. నిమిషంలో 120 పుష్‌ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్‌. అతని ప్రయత్నం సఫలం కావాలని… మరో రికార్డు నెలకోల్పాలని అందరం కోరుకుందాం.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!