జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని అందిపుచ్చుకొని.. ఆయన మళ్లీ పుట్టారా? అన్నట్టుగా సినిమాల్లో రాణిస్తూ తనను తాను నిరూపించుకున్నారు ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చినా కూడా ఎవ్వరూ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి ఎదగలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ.. ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజే వేరు.

ఇక చిన్న వయస్సులోనే టాలీవుడ్ లో అడుగుపెట్టి, హీరోగా అందులోనూ పౌరాణిక పాత్రలో నటించి, అందరినీ మెప్పించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఘనత కూడా ఎన్టిఆర్ కే చెందుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో ఎన్టిఆర్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించాడు. అయితే ఎన్టిఆర్ తో పాటూ సీతగా నటించిన స్మితా మాధవ్ కూడా తన నటనతో అందరినీ అలరించింది. అయితే బాల రామాయణం సినిమా తరువాత స్మితా మాధవ్ మళ్ళీ ఏ సినిమాలోనూ నటించలేదు.

అయితే ఎన్టిఆర్ మాత్రం హీరోగా ‘చూడాలని ఉంది’ సినిమాతో వచ్చి.. వరుస విజయాలతో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే సీతగా నటించిన స్మితా మాధవ్ మాత్రం తనకి ఎంతగానో ఇష్టమైన డాన్స్ వైపు అడుగులు వేసింది, ఇక అందులో పూర్తి ప్రావిణ్యం సంపాదించింది. అంతే కాదు డాన్సర్ గా అనేక స్టేజ్ లపై తన నాట్య ప్రావీణ్యాన్ని చూపించింది.

అంతే కాకుండా కొన్ని సినిమా పాటలకు డాన్స్ కంపోజ్ చేసింది. ఇక మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన డాన్స్ ప్రోగ్రామ్స్ తో అలరిస్తోంది. అంతేకాదు, ఎంతోమందికి డ్యాన్స్ నేర్పిస్తూ.. తన శిష్యులను కూడా దగ్గరుండి డాన్స్ షోలలో ఆరంగేట్రం చేయిస్తోంది.


































