Chiranjeevi: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తుంది. వైసీపీ మంత్రి రోజా మెగా బ్రదర్ నాగబాబు మధ్య జరిగినటువంటి వివాదం గురించి మనకు తెలిసిందే.మెగా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా రాజకీయాలలో కొనసాగారు. అయితే ఈ ముగ్గురు కూడా రాజకీయాలలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి రోజా మాట్లాడుతూ చిరంజీవి ఎప్పుడైనా పేదలకు దానధర్మాలు సహాయ సహకారాలు చేస్తేనే కదా వారిని ప్రజలు ఆదరించేది అందుకే వారి సొంత జిల్లాలోనే ఓడిపోయారు అంటూ కామెంట్లు చేశారు.ఇక రోజా వ్యాఖ్యలపై నాగబాబు స్పందించడం నాగబాబుకు తిరిగి రోజా కౌంటర్ ఇవ్వడం జరిగింది కానీ ఈ విషయంపై చిరంజీవి ఇంతవరకు స్పందించలేదు.
ఈ క్రమంలోనే మొదటిసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ విషయంపై స్పందించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ నేను బ్లడ్ బ్యాంక్ పెట్టాను, ఐ బ్యాంక్ పెట్టాను, కరోనా సమయంలో ఎంతో మంది సినీ కార్మికులకు సహాయం చేశాను. ఇవన్నీ కూడా నా హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు నిదర్శనం.

Chiranjeevi: నా స్థాయిని నేనే తగ్గించుకున్న వాడిని అవుతా…
ఒకవేళ రోజా చేసిన వ్యాఖ్యలకు నేను సమాధానం చెబితే నా స్థాయిని నేనే తగ్గించుకున్న వాడిని అవుతా. ఆమె నాతో పాటు నటించారు. నాతో పాటు సెంటిమెంట్ పంచుకున్నారు, మా ఇంటికి వచ్చి సొంత మనుషుల్లా కలిసిపోయి భోజనం చేయడం ఇంట్లో తిరగడం చేశారు. వాళ్లు వారి మెంటాలిటీ, నైజం ప్రకారం మాట్లాడితే నేను స్పందించేసి మాట్లాడటం నా నైజం కాదు. వారు ఏం మాట్లాడినా దానిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ చిరంజీవి రోజా వ్యాఖ్యలపై స్పందించి కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































