Dasari Vignan : ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సౌత్ లో కూడా విడుదల చేయాలని కరణ్ జోహార్ భావించడంతో సినిమా ప్రమోషన్స్ కోసం సౌత్ చుట్టేశారు. ఇక రాజమౌళి ఈ సినిమాకు సౌత్ లో సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలని హైదరాబాద్ లో ప్లాన్ చేసారు జక్కన్న. ఇక ఎన్టీఆర్ ను ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా పిలిచి సినిమాకు మంచి హైప్ తీసుకురావాలని అనుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్ కి అనుమతిని మొదట ఇచ్చినా చివర్లో రద్దు చేసింది. వినాయక చవితి ఉత్సవాల కారణంగా బందోబస్తులో పోలీసులు ఉండడం వల్ల ఈవెంట్ కి ఎక్కువ మంది పోలీసులను పంపలేమని అందుకే ఈవెంట్ రద్దు చేసుకోమని చెప్పారు. ఇక ఈ ఇష్యూ లో కొత్త కోణాలు ఆవిష్కరిస్తున్నారు కొంతమంది.

బండ్ల ట్వీట్ తో మరోసారి వివాదం…
ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ వల్లే బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ కు అనుమతి రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ మీద పరోక్షంగా విరుచుకుపడ్డాడు కెసిఆర్ అంటూ మాట్లాడుతున్నారు. ఇక ఈ విశ్లేషణలు ఒక వైపు ఉంటే మరో వైపు అగ్గికి ఆజ్యం పోసినట్లు కెసిఆర్ టైగర్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు. సాధారణంగా ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. ఇక అలాంటిది బండ్లన్న కెసిఆర్ ను టైగర్ అన్నాడంటే కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ అసలు బండ్ల గణేష్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక నిర్మాతగా మరో సినిమా ఈవెంట్ రద్దు అయితే ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా, ఆయన చాలా ప్లాన్ గా నిర్మాత అయ్యాడు.

మెగా హీరోలు కాకుండా మిగిలిన ఎవరి సినిమాలైనా ప్లాప్ అవ్వాలని భావిస్తాడు. అందుకే ఎన్టీఆర్ తో బాద్ షా, టెంపర్ సినిమాలకు కూడా బాగా లేట్ చేసి సినిమాలను ప్లాప్ దిశగా తీసుకెళ్లాడు. ఒక హీరో మెగా హీరోలకు పోటీ వస్తాడు అనుకుంటే వారితో సినిమాలు చేసి ప్లాప్స్ చేస్తాడు. ఎక్కువ డేట్స్ తీసుకుని వాళ్ళ షెడ్యూల్స్ ని లేట్ చేస్తాడు, గ్యాప్ వచ్చేలా చేస్తాడు ఇతని గురించి ఇండస్ట్రీ పట్టించుకోవడం మానేసింది అంటూ మాట్లాడాడు విజ్ఞాన్. ఇక ఇపుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ను డివైడ్ చేయాలని చూస్తున్నాడు అంటూ అభిప్రాయపడ్డారు దాసరి విజ్ఞాన్.


































