ఇండియాలో ప్రతీ ప్రేక్షకుడు ఎక్కువగా ఇష్టపడే విషయాల్లో క్రికెట్ ఒకటైతే.. మరొకటి సినిమా. ఇక ఇక్కడ క్రికెట్ గురించి చెప్పుకుంటే.. ఆస్ట్రేలియా కంటే వన్డేలో వరల్డ్ కప్ లు గెలుచుకుంది తక్కువే అయినా.. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా హీరోల కంటే కూడా టీమిండియా క్రికెటర్లకే ఎక్కువ పాపులారిటీ ఉందనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమిండియా రథసారధి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఉన్న రికార్టులను త్వరలోనే కోహ్లీ అధిగమించే సత్తా కూడా ఉందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అంతలా తన ఆటతో ఆకట్టుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాందించుకున్నాడు విరాట్.
2013 సంవత్సరంలో హెడ్ అండ్ షోల్డర్స్ షాంప్ ప్రకటన కోసం మొదటిసారిగా కలిసిన విరాట్, అనుష్క వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతక ముందే విరాట్ చాలామందితో ప్రేమాయణం నడిపినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో పాపులర్ హీరోయిన్లు కూడా ఉన్నట్లు టాక్. విరాట్ కోహ్లీకి మొదటి లవ్ తమిళం, కన్నడంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సాక్షి అగర్వాల్ తో ప్రేమాయాణం నడిపాడు.
ఆర్సీబీకి మద్దతుగా స్డేడియానికి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడి.. తర్వాత వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎపైర్ నడిపాడు. ఈమె బ్రెజిల్ కు చెందిన మోడల్. కొన్ని ఇండియన్ మూవీల్లో కూడా నటించింది. అమీర్ ఖాన్ తలాష్ మూవీ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇషా బెల్లా. తెలుగులోని విజయ్ దేవర కొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలోనూ నటించింది. 2013లో విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడిపింది. సింగపూర్ లో వీళ్లిద్దరూ కలిసి షాపింగ్ లాంటివి చేస్తుండగా మీడియాలకు కూడా దొరికిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.
Advertisement
విరాట్ కోహ్లీ హీరోయిన్ తమన్నాతో కలిసి 2012 లో ఓ అడ్వైజ్మెంట్లో నటించాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల వరకు ప్రేమాయాణం నడిచినట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంపీఎల్ యాప్ కోసం ఇద్దరు మరో సారి యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా కన్నడ నటి సంజన గల్రానీతో కూడా కోహ్లీ లవ్ లో ఉన్నాడట. ఆమె బుజ్జిగాడు సినిమాలో నటించింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది సంజన గల్రానీ. పంజా సినిమాలో నటించిన సారా జేన్ దియాస్ తో కూడా విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.