బుల్లితెరపై సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం “శ్రీదేవి డ్రామా కంపెనీ”.అన్ని రకాల ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం తాజాగా 25వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ వారం ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ లైలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఇంద్రజ స్టేజి మీద వానలో “మెరిసింది మేఘా మేఘా” అంటూ చిందులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఇంద్రజకు తోడుగా లైలా కూడా కాలు కదిపారు. ఈ విధంగా స్టేజ్ పై ఇంద్రజ వేసిన స్టెప్పులు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ దాదాపు 18 సంవత్సరాల తర్వాత స్టేజ్ పై డాన్స్ వేశానని చెప్పడంతో సుడిగాలి సుదీర్ అందరూ చూస్తుండగానే…” 18 ఏళ్ల తర్వాత చేసినప్పటికీ, 18 ఏళ్ల పిల్లల డాన్స్ చేశారు” అని అనడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.






























