నిరుద్యోగ అభ్యర్థులు ఇండియన్ నేవీ శుభవార్తను తెలియజేసింది.ఇండియన్ నేవీ 2500 సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2021 ఆగస్టు బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగానికి పురుషులు, అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు.

కేవలం ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులుగా ప్రకటించింది. ఇందులో ప్రధానంగా
ఆఫీసర్స్, సెయిలర్స్, సివిలియన్స్ మూడు రకాల పోస్టులు ఉంటాయి.సెయిలర్స్, సివిలియన్స్ పోస్టులకు ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్స్ ఇస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2021 ఆగస్టు బ్యాచ్ సెయిలర్స్ ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారక https://www.joinindiannavy.gov.in/వెబ్ సైట్ చూడవచ్చు
ఆర్టిఫిషర్ అప్రెంటీస్– 500 ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. వీరు 2001 జనవరి 1వ తేదీ నుంచి 2004 డిసెంబర్ 31 మధ్యన పుట్టిన వారే ఉండాలి.
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ – 2000 ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
వీరు కూడా 2001 నుంచి 2004 మధ్య జన్మించి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వారు రూ.215 చెల్లించాలి. ఏప్రిల్ 26న ఆన్లైన్ ఈ ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 30 వరకు చివరి తేదీ. ఈ పోస్టుల ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష,ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఎగ్జామ్ వంటి మూడు దశలలో ఎంపిక జరుగుతుంది.
































