Connect with us

Featured

Krishna Vamsi : దేశమంటే మనుషులోయ్ అని చెప్పేవారికి నెను చెప్పేది ఒకటే… ఇంకో 50 సంవత్సరాలకు యుగాంతం : కృష్ణ వంశీ

Published

on

Krishna Vamsi : తెలుగు ఇండస్ట్రీస్ లో విలక్షణమైన సినిమాలు తీసి డైరెక్టర్ గా హిట్లకంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశం మీద ఉండాల్సిన దృక్పదం, ఇప్పుడు యువతరం ఎలా ఉన్నారు, ఆలోచన ధోరణి ఎలా ఉంది అనే విషయాల గురించి మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎలాంటి పరిణామలు ఉంటాయో ఆయన వివరించారు. ఇక యుగాంతం వంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడారు.

దేశమంటే మనుషులు ఒక్కటే కాదు…

భిన్నత్వంలో ఏకత్వం కేవలం మనం దేశంలోనే లేదు, అన్ని దేశాల్లోను ఉంది. ఏ దేశంలో అయినా అసమానతలు ఎప్పుడు ఉంటాయి అవి సమసిపోవు. ఇక ఇన్నేళ్ల స్వాతంత్ర భారత దేశంలో ఎంతో సాధించాము. ఒకప్పుడు మన మీద పెత్తనం చెలాయించిన దేశాన్ని నేడు ఒక భారత సంతతి వాడు పరిపాలించే అవకాశం ఉంది. ఇక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మార్గనిర్దేశనం చేస్తూ ఎంతో మంది భారతీయులు ఉన్నారు. ఇక ఒక దేశం ఒక ప్రాంతం అని మనం హద్దులు వేసుకుంటున్నాం. కానీ ప్రపంచమంతా ఒక్కటే అందరు మనుషులు ఒక్కటే అంటూ కృష్ణ వంశీ అన్నారు. ఈ మధ్యనే సుద్దాల అశోక్ తేజ నాకో పుస్తకమిచ్చి దేశమంటే మనుషులు మాత్రమే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ భూమి మీద మనుషులు మాత్రమే అన్నట్లుగా వ్యవహారిస్తున్నాం. ప్రతి జీవికి, చెట్టుకి, కొండలకు, పర్వతలకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంటుంది కదా అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

బుద్ధి జీవులం అనుకుని ఈ భూమిని నాశనం చేస్తున్నాము అంటూ మాట్లాడారు. స్టీవెన్ హాకిన్స్ ఎప్పుడో చెప్పేసారు ఇక ఈ భూమి మనుగడ కొన్నేళ్ళే వేరే గ్రహం చూసుకోండి అంటూ. అది ఇంకో యాభై ఏళ్ళు మాత్రమే అని చెప్పారు కృష్ణ వంశీ. జనం ఎప్పుడు చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళ జీవనపోరాటం నుండి ఒక్కసారి బయటికి వచ్చి రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే అపుడు ఇక ఆ నాయకుల కుటుంబంతో సహా అందరూ ఇంటికి వెళ్ళాల్సిందే. హిట్లర్ అంతటి వాడే జనం వ్యతిరేకత ముందు నిలబడలేక పోయాడు. పబ్లిక్ కి అంత పవర్ ఉంది, కాకపోతే అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళేం పిచోళ్లు కాదు అంటూ కామెంట్స్ చేసారు. ఇక యువతరానికి చరిత్ర చదవాలని సూచించారు. స్వాతంత్రం ఎలా వచ్చిందో నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!