కరోనా అందరికి చుక్కలు చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు అని తేడాలేదు.. దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు ముతప్పడ్డాయి.. అదే క్రమంలో వైన్స్ షాపులు కూడా మూతపడ్డాయి. కానీ కొందరు మద్యానికి బానిసై తీవ్ర మనోఒత్తికి లోవుతున్నారు. ఇప్పటికే ఎర్రగడ్డ హాస్పిటల్ లో భారీగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందిలే.

దివంగత సీనియర్ నటి మనోరమ కుమారుడు భూపతి మద్యం దొరక్క నిద్రమాత్రలు మింగటంతో ఆయన్ను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలో నివాసం ఉంటున్న భూపతి లాక్ డౌన్ నేపథ్యంలో మధ్యం షాపులు పూర్తిగా మూసివేయబడడంతో మద్యానికి బానిసైన భూపతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. రోజు రోజుకు ఆ బాధ ఎక్కువతుండటంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగేశారు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు చెన్నైలోని డాక్టర్లు. అయన కండిషన్ కాస్త సీరియస్ గా ఉందని సమాచరం.
































