Connect with us

Featured

సినిమాలతో పాటుగా మన టాలీవుడ్ స్టార్స్ సైడ్ బిజినెస్ !!

Published

on

తెలుగు ఇండస్ట్రీలో సినీ తారలకు చాలా క్రేజ్ ఉంటుంది. అంతేకాకుండా సినిమాలలో వారు హిట్ కొడితే ఆ తర్వాత భారీ స్థాయిలో వారు డబ్బులు సంపాదిస్తారు. ఇక అదే స్థాయిలోనే వారి ఖర్చులు కూడా వారికి ఉంటాయి. లగ్జరీ కారు, ఇల్లు, వాళ్ల ఇళ్లల్లో పనిచేసే పనులు.. ఇలా చాలా రకాలుగా వారి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. ఇలాంటివి కొంతమందికి లక్షల్లో ఉంటే మరి కొంత మందికి కోట్లలో ఉంటుంది. చాలా మంది సినీ తారలు సినిమాలలో ఒక వెలుగు వెలిగి బాగా సంపాందించిన వారే. మరి కొందరు తారలు అయితే పేరు సొంతం చేసుకున్న డబ్బు మొత్తం పూర్తిగా అయిపోయి మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది గత తరం వారి సినీ తారలలో ఎక్కువగా కనపడుతుంది.

కానీ ప్రస్తుత తారలు మాత్రం ఎప్పుడు లగ్జరీ జీవితాన్ని కొనసాగించాలని.. సినిమాలతో పాటు వారు సైడ్ బిజినెస్ లు కూడా మొదలు పెడుతున్నారు. ప్రస్తుత హీరోలు, హీరోయిన్లకు వారు లగ్జరీగా జీవించాలి అంటే వారు ఏమి చేయాలో బాగా తెలుసు. అందుకోసమే సినీ తారలు లాభాలు ఎక్కువగా సంపాదించే బిజినెస్ ను ఎంచుకొని మొదలు పెడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుత సినీతారలు ఏ బిజినెస్ లో ఎంచుకున్నారో ఒకసారి చూద్దాం… ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో తెలుసుకోవాల్సింది మెగాస్టార్ చిరు.. చిరుకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. సినీ నిర్మాణ సంస్థ కూడా ఉంది. చిరు తన తోటి నటుడు నాగార్జున, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి క్రీడారంగ ఫ్రాంచైజీ వ్యాపారంలో కొనసాగుతున్నాడు. ఇటీవల చిరు కేరళ ఫుట్ బాల్ జట్టును కూడా కొనుగోలు చేశాడు.

కాజల్ అగర్వాల్ జ్యువెలరీ బిజినెస్ మొదలుపెట్టారు. కాజల్ అగర్వాల్, చెల్లెలు నిధి అగర్వాల్ తో కలిసి మార్షల్ జూలరీ షాప్ ప్రారంభం చేసింది. ఇక అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నగలను ఆన్లైన్ లో అమ్ముతున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్, ప్రధాన నగరాలలో తమ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఈయన మంచి వ్యాపారవేత్త కూడా. ఈ మనకు స్వతహాగా సినీ నిర్మాణ సంస్థ కూడా ఉంది. మహేష్ బాబు ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థతో పాటు ఏఎంబి సినిమాస్ అనే పేరుతో కూడా మల్టీప్లెక్స్ మొదలుపెట్టారు.

ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జిమ్స్ లో పెట్టుబడులు పెడుతుంది. ఇప్పటికే హైదరాబాదు గచ్చిబౌలిలో ఈమె ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది.. ఇక అక్కినేని నాగార్జున విషయానికి వస్తే మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. నాగార్జునకు “ఎన్ గ్రిల్” పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన అనేక రంగాలలో సంపాదనలు పొందుతున్నారు. వీరు మాత్రమే కాదు మహేష్ బాబు “ఏఎంబీ సినిమాస్”, రామ్ చరణ్ (ట్రుజేట్ విమానాలు), అల్లు అర్జున్ (నైట్ క్లబ్స్) , మంచు విష్ణు, జగపతి బాబు, తమన్నా మరి కొంతమంది స్టార్స్ కూడా పలు వ్యాపారాలు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!