ఇంగ్లాండ్లో ఓ దుండగుడు కాల్పుల తెగబడ్డాడు. ప్లైమౌత్లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లుగా పోలీసులు స్రాథమికంగా నిర్థారించారు. అయితే మృతుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ప్రమేయమేమి లేదని పోలీసులు తెలిపారు.

సాయంత్రం 6:10 గంటల సమయంలో ప్లైమౌత్లోని కీహామ్ ప్రాంతంలోని బిడ్డిక్ డ్రైవ్లో తుపాకీ కాల్పులు జరిగాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు, అధికారులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాల్పుల్లో పదులు సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇది తీవ్రమైన చర్యగా పోలీసులు పేర్కొన్నారు.































