సినీ నటి ప్రియమణి వివాహ బంధం గురించి గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఆమె చేసుకున్న వివాహం చట్టపరంగా చెల్లదంటూ ప్రియమణి భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంపై ముస్తఫా స్పందిస్తూ తనకు చట్టపరంగా విడాకులు ఇచ్చిన తరువాతనే ప్రియమణిని 2017 లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీల పెళ్లి అంటే పెద్ద ఎత్తున హంగు ఆర్బాటాలు ఉంటాయి. కానీ కానీ ప్రియమణి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా కేవలం రిజిస్టర్ ఆఫీస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.

ప్రియమణి పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి జరుపుకోవడానికి గల కారణాలను కూడా ప్రియమణి ఓ సందర్భంలో తెలియజేశారు. ముస్తఫా, ప్రియమణి మతాలు వేరు కావడం వల్ల ఎవరి సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగకుండా రిజిస్టర్ ఆఫీస్ లో తమ వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరి వివాహం తర్వాత వివాహ రిసెప్షన్ కు పలువురు సినీతారలను ఆహ్వానించి ఎంతో వైభవంగా వివాహ రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న క్రమంలో ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా వీరి పెళ్లి చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్ట పరంగా ముస్తఫా తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని పెళ్లి చేసుకోవడం వల్ల వీరి వివాహం చెల్లదని ఇప్పటికీ ముస్తఫా భార్యగా నాకు ఆ అర్హత ఉందంటూ ఆరోపించారు.
ఈ విషయంపై ప్రియమణి దంపతులు మాట్లాడుతూ చట్టపరంగా తనకు విడాకులు ఇచ్చిన తర్వాతనే ముస్తఫా వివాహం జరిగిందని, మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండడంచేత వారి సంరక్షణ కోసం ముస్తఫా డబ్బులు పంపిస్తున్నారని,తన నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడం కోసమే అయేషా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ముస్తఫా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రియమణి మాట్లాడుతూ తమ వివాహ బంధానికి ఎలాంటి డోకా లేదని, ఎవరు ఎన్ని చెప్పినా చట్ట ప్రకారమే తమ వివాహం జరిగిందని, తన వైవాహిక జీవితానికి ఏ ప్రమాదం లేదంటూ ప్రియమణి ఎంతో సాఫీగా సమాధానం చెప్పారు.































