Connect with us

Featured

అప్పట్లో రిజిస్టర్ మ్యారేజ్.. ఇప్పుడు పెళ్లి చెల్లదంటూ మొదటి భార్య గోల.. ప్రియమణి పరిస్థితి ఇది!

సినీ నటి ప్రియమణి వివాహ బంధం గురించి గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఆమె చేసుకున్న వివాహం చట్టపరంగా చెల్లదంటూ

Published

on

సినీ నటి ప్రియమణి వివాహ బంధం గురించి గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఆమె చేసుకున్న వివాహం చట్టపరంగా చెల్లదంటూ ప్రియమణి భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంపై ముస్తఫా స్పందిస్తూ తనకు చట్టపరంగా విడాకులు ఇచ్చిన తరువాతనే ప్రియమణిని 2017 లో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీల పెళ్లి అంటే పెద్ద ఎత్తున హంగు ఆర్బాటాలు ఉంటాయి. కానీ కానీ ప్రియమణి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా కేవలం రిజిస్టర్ ఆఫీస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు.

Advertisement

ప్రియమణి పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి జరుపుకోవడానికి గల కారణాలను కూడా ప్రియమణి ఓ సందర్భంలో తెలియజేశారు. ముస్తఫా, ప్రియమణి మతాలు వేరు కావడం వల్ల ఎవరి సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగకుండా రిజిస్టర్ ఆఫీస్ లో తమ వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరి వివాహం తర్వాత వివాహ రిసెప్షన్ కు పలువురు సినీతారలను ఆహ్వానించి ఎంతో వైభవంగా వివాహ రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న క్రమంలో ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా వీరి పెళ్లి చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్ట పరంగా ముస్తఫా తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని పెళ్లి చేసుకోవడం వల్ల వీరి వివాహం చెల్లదని ఇప్పటికీ ముస్తఫా భార్యగా నాకు ఆ అర్హత ఉందంటూ ఆరోపించారు.

ఈ విషయంపై ప్రియమణి దంపతులు మాట్లాడుతూ చట్టపరంగా తనకు విడాకులు ఇచ్చిన తర్వాతనే ముస్తఫా వివాహం జరిగిందని, మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండడంచేత వారి సంరక్షణ కోసం ముస్తఫా డబ్బులు పంపిస్తున్నారని,తన నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడం కోసమే అయేషా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ముస్తఫా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రియమణి మాట్లాడుతూ తమ వివాహ బంధానికి ఎలాంటి డోకా లేదని, ఎవరు ఎన్ని చెప్పినా చట్ట ప్రకారమే తమ వివాహం జరిగిందని, తన వైవాహిక జీవితానికి ఏ ప్రమాదం లేదంటూ ప్రియమణి ఎంతో సాఫీగా సమాధానం చెప్పారు.

Advertisement

Featured

Pawan Kalyan: ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జనసేనాని!

Published

on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఒంటరిగా పోరాటం చేయకుండా తెలుగుదేశం బిజెపితో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన రోడ్డు షోలలో పాల్గొంటున్నారు.

ఇక ఈనెల 18 నుంచి నామినేషన్స్ కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ కి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.

Advertisement

ప్రారంభమైన నామినేషన్లు..
నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రమే ఈయన ఉప్పాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్స్ వేశారు మొదటి రోజు అసెంబ్లీ సెగ్మెంట్లకు 197 నామినేషన్ల దాఖలు కాగా, పార్లమెంట్ సెగ్మెంట్లకు 42 నామినేషన్ల దాఖలయ్యాయి. అందులో వైసీపీ, ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!