Samantha: సమంత కథ కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఈమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విధంగా సమంత ఆరోగ్యం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ సమంత మాత్రం తన ఆరోగ్య విషయంపై ఎప్పుడు స్పందించలేదు.

ఈ క్రమంలోనే యశోద ట్రైలర్ విడుదలైన అనంతరం యశోద సినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా ఈమె హాస్పిటల్ బెడ్ పై చేతికి సెలైన్ పెట్టించుకున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి బయటపెట్టారు.
సమంత కథ కొద్దిరోజులుగా అరుదైన మాయోసైటిసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఎంతో కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధి నుంచి సమంత తొందరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా# Samantha Ruth Prabhu అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

Samantha: ట్విట్టర్ ట్రెండింగ్ లో సమంత..
ఇకపోతే ఈ విధమైనటువంటి మాయోసైటిసిస్ వ్యాధితో బాధ పడేవారు ఎక్కువగా కండరాలు వాపకు గురవడం లేదా ఇతర ఇన్ఫెక్షన్లు సోకిన రోగనిరోధక శక్తి తగ్గి తొందరగా క్షీణించపోతారు కొంత సేపు నడిచిన పని చేసిన అలసిపోవడం, శ్వాస సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ వ్యాధిని హీట్ తెరపి ఫిజియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చని తెలుస్తోంది.అయితే ఈ వ్యాధి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన మరణం కూడా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమంత ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడటంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


































