Shiya Gowtham : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమా లో హీరోయిన్ గా వచ్చిన శియా గౌతమ్ మరో పేరు అధితి గౌతమ్. నేనింతే సినిమా తరువాత మళ్ళీ ఏడు ప్రేమకథలు, వేదం సినిమాలో నటించింది. ఆ తరువాత దాదాపుగా సినిమాల్లో కనిపించని శియా మళ్ళీ చాలా రోజుల తరువాత మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్ లో నటించింది.

నాగార్జున అంటే క్రష్ అండ్ లవ్…
ఇక తనకు నాగార్జున అంటే చాలా క్రష్ అని చెప్పింది శియా. చాలా రోజుల తరువాత ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న శియా రవితేజ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని కితాబిచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ఆర్ఆర్ చూసానని అందులో కొమరం భీముడో పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను కొట్టే సన్నివేశంలో చాలా ఏడుపొచ్చిందని, ఇప్పటికి అది గుర్తుకుతెచ్చుకుంటే రొమాలు నిక్కబోడుచుకుంటాయని చెప్పింది.

ఇక అల్లు అర్జున్ గురించి అడుగగా స్టైలిష్ గా ఉంటారని ఇక రాజమౌళి గారితో, ప్రశాంత్ నీల్ తో పని చేయాలని ఉందని శియా తన మనసులోని మాటను చెప్పింది. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో శియా నటించింది. ఇక ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.































