సోనూ సూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కరోనా క్లిష్ట పరిస్థితులలో సోనూసూద్ అడిగిన వారికి లేదనకుండా చేసిన సహాయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తూ అందరి పట్ల రియల్ హీరో గా గుర్తింపును సంపాదించుకున్న సోనూసూద్ నిరంతరం పేదల కోసం కృషి చేస్తూనే ఉన్నారు.

కరోనా క్లిష్ట సమయంలో ఎంతో మందికి సహాయం చేసిన సోనుసూద్ తాజాగా కొత్త వ్యాపారాలను మొదలుపెట్టాడు.అయితే ఈ వ్యాపారాలు తన స్వలాభం కోసం మాత్రం కాదు. ఎంతో మంది చిన్న వ్యాపారులను ప్రోత్సహించడం కోసం సోనుసూద్ చేస్తున్న ప్రయత్నం అని చెప్పవచ్చు. ఈ విధంగా చిరు వ్యాపారులకు మద్దతిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం సైకిల్పై గుడ్లు బ్రెడ్ వంటి వాటిని అమ్మాడు. కావలసిన వారికి డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుందని అయితే డోర్ డెలివరీ కోసం మరింత అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా సోనుసూద్ తందూరి రోటీలను చేస్తూ.. మరోసారి అందరినీ సందడి చేశారు.
తాజాగా పంజాబీ ధాబా ఓపెన్ చేసి అందులో స్వయంగా తందూరి రోటీలు చేసి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… సోను చేసిన రోటీలను తింటే ఎప్పటికీ మరిచిపోలేని.. ఇక్కడ తిన్న తర్వాత మరెక్కాడ తినలేరు అంటూ కామెంట్ జతచేసి వీడియో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సోనుసూద్ పిలుపునిచ్చారు.


































