Tag Archives: ram gopal varma

Jr.NTR: ఎన్టీఆర్ తలుచుకుంటే రాత్రికి రాత్రి టిడిపి సమాధి.. వర్మ షాకింగ్ కామెంట్స్?

Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ దర్శకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా బయోపిక్ సినిమాల వెంట పడుతున్నారు. దీనితో ఈయన సినిమాలన్నీ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే

ఇకపోతే త్వరలోనే వ్యూహం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వేడిని పెంచడానికి ఈయన వ్యూహం సినిమాని చేసి దానిని ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టం లేక రాజకీయాలకు దూరంగా ఉన్నారా లేక టిడిపి పార్టీ తనని దూరం పెట్టిందనే విషయం తనకు తెలియదని తెలిపారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్నంత క్రేజ్ ఉందని తెలిపారు.

భయపడుతున్నారా..

జూనియర్ ఎన్టీఆర్ కనుక తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఒక్క మాట చెబితే రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ సమాధి అవుతుందని లోకేష్ చంద్రబాబు నాయుడు వంటి వారందరూ కూడా ఫినిష్ అవుతారని వర్మ తెలిపారు. ఆ భయం వారిలో ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పట్ల ద్వేషం పెంచుకొని తనని దూరం పెడుతున్నారు అంటూ వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

RGV: శ్రీదేవి ఫోటోను చూసి ఏడ్చిన రామ్ గోపాల్ వర్మ.. ఎమోషనల్ ట్వీట్ వైరల్?

RGV: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు.

ఒకరకంగా చెప్పాలి అంటే రాంగోపాల్ వర్మ దర్శకుడుగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా హైలెట్ అయ్యారని చెప్పవచ్చు. ఇదంతా మొన్నటి వరకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ చాలా తక్కువగా మాత్రమే సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇది ఇలా ఉండే తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. అసలేం జరిగింది రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో ఏం రాసుకోవచ్చారు అన్న విషయానికి వస్తే… దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది. ఇకపోతే డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే.

శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది..

ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించానని కూడా తెలిపారు ఆర్జీవి. శ్రీదేవితో కలిసి ఆర్జీవీ రెండు సినిమాలు తీసాడు కూడా. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుడప్పుడు శ్రీదేవి ప్రస్తావన తన ఇంటర్వ్యూలలో కానీ, సోషల్ మీడియాలో కానీ తీసుకొస్తూ ఉంటాడు. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన ఒక శ్రీదేవి ఫోటోని ఆర్జీవీ షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో ఆర్జీవికి శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చాడు అనే అర్ధంలో పోస్ట్ చేసాడు. దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నీకు కూడా ఏడుపు వస్తుందా!ఏం తాగి పోస్ట్ చేశావా అంటూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2cmRZ_pDqb/?utm_source=ig_embed&ig_rid=51e4d1ee-b28d-4e64-9ea0-04154e2752f2

Ram Gopal Varma: ఆస్కార్ అవార్డు తప్పకుండా తనకే ఇవ్వాలి… వర్మ కామెంట్స్ వైరల్!

Ram Gopal Varma: టాలివుడ్ లో ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆర్జీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆర్జీవీ ఇప్పుడు సరైన అవకాశాలు అందుకోలేకపోతున్నాడు . అయితే ప్రస్తుతం ఆర్జీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినీ ప్రముఖుల మీద రాజకీయ ప్రముఖుల మీద తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అందువల్ల రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడుగా ఇండస్ట్రీలో గుర్తింపు.

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ టిడిపి నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు గురించి కూడా అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా మరొకసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి కూడా రాంగోపాల్ వర్మ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Ram Gopal Varma: నారా లోకేష్ కి ఆస్కార్ రావాలి…


తాజాగా పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ నేల తల్లికి నమస్కరిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనను మనస్ఫూర్తిగా ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే నారా లోకేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ కి రాంగోపాల్ వర్మ స్పందిస్తూ మరొక పోస్ట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో ఆర్జీవీ స్పందిస్తూ..” ఆస్కార్ అవార్డు దక్కాల్సింది రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కాదు … అవార్డు ఖచ్చితంగా నారా లోకేష్ కి దక్కాలి అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ కి పలువురు టిడిపి నేతలు కార్యకర్తలు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Ram Gopal Varma: సె**లో ఏ యాంగిల్ అంటే ఇష్టం… వర్మకే బోల్డ్ ప్రశ్న వేసిన బోల్డ్ బ్యూటీ!

Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్మ ఈ మధ్యకాలంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద ఇంటర్వ్యూల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన ఆశు రెడ్డితో కలసి చేసిన ఇంటర్వ్యూ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే.

వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలువురు బోల్డ్ బ్యూటీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే అశు రెడ్డితో కలిసి వర్మ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇకపోతే మరొక బోల్డ్ బ్యూటీ సాయి దివ్య సైతం వర్మను ఇంటర్వ్యూ చేసింది. అయితే బోల్డ్ కామెంట్స్ చేసే రామ్ గోపాల్ వర్మకు ఈమె బోల్డ్ ప్రశ్నలు వేసి షాక్ ఇచ్చింది.

Ram Gopal Varma: అన్ని యాంగిల్స్ ఇష్టమే…


ఈ క్రమంలోనే సె* గురించి ప్రశ్నిస్తూ వర్మ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ క్రమంలోనే మీకు సె* లో ఏ యాంగిల్ అంటే ఇష్టము అని ప్రశ్నించగా తనకు సె** లో అన్ని యాంగిల్స్ ఇష్టమంటూ మరోసారి వర్మ బోల్డ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం యాంకర్ సాయిదివ్యతో వర్మ ఇంటర్వ్యూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

Ram Gopal Varma: అషురెడ్డి కాళ్లను ముద్దాడిన వర్మ.. అయితే ఏంటంటూ నెటిజన్లపై ఆర్జీవీ ఫైర్!

Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు. అందుకే ఆయన్ని కొందరు విలక్షణ దర్శకుడిగా కాకుండా వివాదాల దర్శకుడిగా పిలుస్తుంటారు. తాజాగా ఆయన అషురెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్టీవీ ఇంతగా దిగజారిపోయాడని, అసలు అషురెడ్డి కాలి వేళ్లను ముద్దాడటం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు.

రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి కాలి వేళ్లను ముద్దు పెట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు. అందుకే పలువురు నెటిజన్లు ఆర్జీవీ వీడియోపై, ఆర్జీవీ కామెంట్లపై ఫైర్ అవుతున్నారు. దీంతో ఆర్జీవీ స్వయంగా రంగంలోకి దిగారు. అషురెడ్డి కాలి వేళ్లను ముద్దాడటం గురించి మాట్లాడుతూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

తాను షేర్ చేస్తున్న వీడియో ఎవరినీ ఉద్దేశించిది కాదని, ముఖ్యంగా తన సో కాల్డ్ ఫాలోయర్స్ కోసం ఈ వీడియో చేయడం లేదని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. తాను ఏం చేసినా సోషల్ మీడియాలో బిట్లు బిట్లుగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని, తనపై వికారంగా మీమ్స్ చేస్తున్నారని, అంతేకాకుండా తనపై ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారని తెలిపాడు. తాను అషురెడ్డితో ఈ ఇంటర్వ్యూ ఎలాంటి అభ్యంతరం లేకుండా చేశానని అన్నాడు.

ram gopal varma…

లైఫ్ లో అందరూ కష్టపడి పని చేస్తారని, ప్రతి ఒక్కరికీ కూడా ఎంటర్టైన్ మెంట్ అనేది కచ్చితంగా అవసరమని ఆర్జీవీ తెలిపారు. ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వారు ఏదోక ఎంచుకుంటారని, అవి మీకు ఇష్టం లేకుంటే చూడటం మానేయండని ఆర్టీవీ ఫైర్ అయ్యారు. తన వినోదం తాను ఏదోకటి చేస్తుంటే పనిలేనివాళ్లంతా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపాడు. అషురెడ్డి కాళ్లను ముద్దాడుకోవడం తన ఇష్టమని, నచ్చినవాళ్లు చూడండి..నచ్చని వాళ్లు చూడకండని ఖరాకండీగా చెప్పేశాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వడానికి కారణం అదేనా? క్లారిటీ ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ!

Ram Gopal Varma:టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఒకానొక సమయంలో తెలుగు హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం వర్మ ఆ స్థాయిలో సినిమాలు చేయలేదని విషయం అందరికీ తెలిసిందే.

RGV: ఆర్జీవీ ట్విట్టర్ లో మరో పోస్టు..! హీరోలందరూ.. బిక్షాటనకు వెళ్లారంటూ..!

ఇకపోతే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎక్కువగా బయోపిక్ చిత్రాలపై తన ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఈయన బయోపిక్ చిత్రాలు చేయడం పెద్ద ఎత్తున వివాదాలలో నిలవడం మనం చూస్తున్నాము.ఇకపోతే ఇప్పటికే ఎన్నో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ చిత్రాలను చేయగా తాజాగా సీఎం జగన్ రామ్ గోపాల్ వర్మకు సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాపై పెద్దగా ఎవరు ఫోకస్ పెట్టరు. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ సినిమాలను చేశారు.

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ కు డబ్బు కావాలి…

ఈ క్రమంలోనే మరోసారి ఈయన సీఎం జగన్ చెప్పారని సినిమా చేస్తున్నారు అంటే కేవలం అధికార ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపించడం కోసమే సినిమా చేస్తున్నారు.ఒక వ్యక్తి గెలుపుకి మరొక వ్యక్తి ఓటమికి గల కారణాలు ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు భరద్వాజ్ వెల్లడించారు.అయితే ఇదివరకే ఈయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ అప్పటికి మాత్రమే కొంచెం బజ్ క్రియేట్ చేశాయి. ఆ సినిమాలను ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని రాంగోపాల్ వర్మకు పని కావాలి ఆయనకు డబ్బు కావాలి అందుకే ఇలాంటి సినిమాలు చేస్తుంటారు అంటూ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Ram Gopal Varma: “రేపు ఇలాంటి దుస్థితి మీకు రాక మానదు.. ఇలా చేయడానికి సిగ్గుండాలి” షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా టాలీవుడ్ సెలబ్రిటీలు కృష్ణంరాజు మరణం తర్వాత ఆయనను సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువరు కూడా సెలబ్రిటీలపై కామెంట్లు చేస్తూ వివాదానికి తెర లేపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోలు కృష్ణంరాజు మృతి చెందినప్పటికీ ఆయనకు నివాళులు అర్పించి అనంతరం తమ సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే వర్మ తనదైన శైలిలో ఈ విషయంపై కామెంట్ చేస్తూ.. లెజెండరీ నటుడు కృష్ణంరాజు చనిపోతే ఆయనకు నివాళిగా సినిమా షూటింగ్ లు ఆపకపోవడంపై ఈయన మండిపడ్డారు. ఆ మహానటుడి కోసం ఒక్క రోజు కూడా సినిమా షూటింగులు ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: ఎంతో సిగ్గుచేటు…

రేపు పొద్దున ప్రతి ఒక్కరికి ఇలాంటి దుస్థితి రాకమానదు.ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇలా వర్మ టాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మరి కొంతమంది ఇలాంటి సమయంలో ఇలాంటి ట్వీట్ చేస్తూ అందరినీ గెలవడం అవసరమా అంటు కామెంట్లు పెడుతున్నారు.

Ashu Reddy: సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ అందాల జాతర చేసిన అషు రెడ్డి.. అమ్మడి అందాల జాతర మామూలుగా లేదుగా?

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అషు రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఎంతో పాపులారీటీ సంపాదించుకున్నారు.ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్త సమంత పోలికలతో ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంతగా పాపులర్ చేశారు.

ఈ క్రమంలోనే ఇదే అవకాశంగా భావించిన అషు రెడ్డి రోజురోజుకు విపరీతమైన సాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇదే పాపులారిటీతో ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సమయంలోనే వెనతిరిగి వచ్చింది. బిగ్ బాస్ తర్వాత సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

 

ఇకపోతే తాజాగా మరోసారి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి బిగ్ బాస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె వరస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

అందంతో మతిపోగోడుతున్న బిగ్ బాస్ బ్యూటీ…

తాజాగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో ఈమె పొట్టి నిక్కరు స్లీవ్ లెస్ టైట్ టీ షర్ట్ ధరించి అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సముద్రంలో పడవపై ప్రయాణం చేస్తూ ఒకవైపు సముద్ర అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు తన అందాలతో అభిమానులకు విందు వడ్డించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ లు యధావిధిగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!

Ramgopal Varma: రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు.ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాలలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే వర్మ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ద్రౌపతి రాష్ట్రపతి అయితే మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు? అంటూ వర్మ అభ్యంతరకరమైన ట్వీట్ చేశారు.

Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!

ఈ విధంగా వర్మ రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈయన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు వర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా.. మరికొందరు వర్మ ఒక వేస్ట్ ఫెలో అని, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!

ఈ విధంగా వర్మ పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి వర్మ తను ఉద్దేశపూర్వకంగా అలాంటి ట్వీట్ చేయడం లేదంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నాకు మహాభారతంలో నచ్చిన పాత్ర ద్రౌపతి. ఇలాంటి పేరు చాలా అరుదుగా ఉంటుంది. ద్రౌపతి పేరు వినగానే అందుకు సంబంధించిన పాత్రల పేర్లు గుర్తుకు వచ్చాయి అని ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి అభ్యర్థిని కించపరచడం సరికాదు…

తానం ఉద్దేశపూర్వకంగా ఎవరి సెంటిమెంట్లను కించపరచాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయలేదని వర్మ మరొక ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ బిజెపి నేత జీఎల్ వీ వర్మ లక్ష్మణ రేఖ దాట్టోద్దని ఆయనను హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి విమర్శలు సరికాదని, ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పెట్టాలి అంటూ ఈయన వర్మను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. మొత్తానికి వర్మ తను చేసిన ట్వీట్ పై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో చేయలేదని మరొక ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?

Ramgopal Varma: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా, రాజకీయాలు అనే తేడా లేకుండా అన్ని విషయాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్నుని ఉద్దేశించి వర్మ ట్విట్టర్ లో.. ‘ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? ’అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా వర్మ చేసిన ఈ ట్వీట్ పై బీజేపీ నేత రాజా సింగ్ వర్మ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే..వర్మ వేస్ట్ ఫెలో అంటూ ఆగ్రహం?

ఈ సందర్భంగా రాజాసింగ్ స్పందిస్తూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బ‌రిలో ఉన్న‌ ద్రౌపతి ముర్మును ఈ విధంగా వర్మ కించపరుస్తూ ట్వీట్ చేశారని ఆయన పై మండిపడటమే కాకుండా వర్మ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ ఆదివాసీ రాష్ట్రపతి మహిళ అభ్యర్ధిపై వర్మ ఇలా పోస్ట్ చేయడం బాధాకరమన్నారు.

వర్మ మత్తులో ఇలాంటి పోస్ట్ లు చేస్తుంటారు…

వర్మ తాగిన మత్తులో ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారని రాజ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ఒక వేస్ట్ ఫెలో అంటూ వర్మ పై ఫైర్ అయ్యారు. ఈయన కేవలం రాంగోపాల్ వర్మపై మాత్రమే కాకుండా,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ పై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ పై రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.